పార్వతీపురం: ఉద్యోగుల స్పందనకు వచ్చే వినతులు సకాలంలో పరిష్కరించాలని పార్వతీపురం మన్యం జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకట రావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఉద్యోగుల గ్రీవెన్స్ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పాల్గొని వినతులు స్వీకరించారు. ఉద్యోగులు వివిధ అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. జీతభత్యాలు, ఇంక్రిమెంట్లు, బది లీలు, పదోన్నతులు తదితర సమస్యలపై ఉద్యోగులు అర్జీలు అందజేశారు. ఉద్యోగుల గ్రీవెన్స్ ఐదు దరఖాస్తులు అందినట్లు డీఆర్ఓ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రజారవాణా అధికారి టీవీఎస్. సుధాకర్, జిల్లా కార్మిక అధికారి రామకృష్ణా రావు, పంచాయతీ రాజ్ డీఈ గంగాధర్, విద్యాశాఖ అధికారి ఎం.రమాజ్యోతి, ట్రెజరీ అధికారి ఆదిత్య సింగ్ తదితరులు పాల్గొన్నారు.