రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్‌ మృతి | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్‌ మృతి

Published Wed, Oct 25 2023 1:02 AM

ప్రమాదంలో మృతి చెందిన నిహార్‌ రంజన్‌ మహంతి  - Sakshi

నందిగాం: మండలంలోని పాత్రునివలస జాతీయ రహదారిపై సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్‌ మృతి చెందాడు. నందిగాం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒడిషా కటక్‌ జిల్లా ప్రజాపడకు చెందిన నిహార్‌ రంజన్‌ మహంతి(36) కటక్‌ నుంచి స్టీల్‌ రాయి లోడ్‌తో విశాఖ పట్నం స్టీల్‌ప్లాంటుకు వెళ్లి అక్కడ లోడ్‌ దించేశాడు. తిరుగు ప్రయాణంలో విశాఖపట్నం నుంచి పశువుల దాణా లోడ్‌తో కటక్‌ వెళ్తూ సోమవారం ఉదయం 5 గంటలకు మండలంలోని పాత్రునివలస వద్దకు వచ్చే సరికి లారీ టైర్ల గాలి చెక్‌ చేయడం కోసం దిగాడు. టైర్లు చెక్‌ చేస్తూ వాటి మధ్య ఉన చిన్న రాళ్లు తీస్తుండగా టెక్కలి నుంచి పలాస వైపు వస్తున్న లారీ అతి వేగంగా వచ్చి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో నిహార్‌ రంజన్‌ కింద పడిపోగా అతనిపై నుంచి లారీ వెళ్లిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. ఢీ కొన్న లారీలో ఉన్న క్లీనర్‌ బీవీ నర్సయ్యకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం గమనించిన స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి నందిగాం పోలీసులు చేరుకొని నిహార్‌రంజన్‌ మహంతి మృతదేహాన్ని టెక్కలి జిల్లా కేంద్రాస్పత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశా రు. మృతుని అన్నయ్య నిర్మల్‌ రంజన్‌ మహంతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నందిగాం ఎస్‌ఐ మహమ్మద్‌ అమీర్‌ ఆలీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement