మల్కన్గిరి: జిల్లాలోని పోడియ సమితి కుమార్వీధికి చెందిన సునీల్ పోడియామి(21) మృతదేహం ఎట్టకేలకు బుధవారం లభ్యమైంది. వివరాల్లోకి వెళ్తే.. అక్టోబర్ 29వ తేదీన సునీల్ తన స్నేహితులతో కలిసి మార్నింగ్ వాక్కు వెళ్లాడు. అయితే మధ్యాహ్నం వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు స్నేహితులను సునీల్ ఎక్కడని అడిగారు. శబరీ నదిలో స్నానం చేసి వస్తానని చెప్పాడని వారు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దీంతో నది వద్దకు వెళ్లగా గట్టుపై సునీల్ దుస్తులు, సెల్ఫోన్ ఉన్నాయి. దీంతో నదిలో గల్లంతయ్యాడని కుటుంబ సభ్యులు పోడియ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. అగ్నిమాపక సిబ్బంది నదిలో రెండు రోజుల పాటు గాలించినా ఎటువంటి ఆచూకీ లభ్యమవ్వలేదు. దీంతో మిస్సింగ్ కేసుగా నమోదు చేసి పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు. కాగా బుధవారం ఉదయం నదిలోని రాళ్ల మధ్యలో సునీల్ మృతదేహం తేలుతూ కనిపించింది. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా, పోడియ ఐఐసీ నిరంజన్ పైకారాయి తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది నదిలో దిగి మృతదేహాన్ని బయటకు తీశారు. అయితే తమ బిడ్డను ఎవరో హత్య చేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోడియ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వస్తే హత్య జరిగిందా, ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడా అనేది తెలుస్తుందని పోలీసులు పేర్కొన్నారు.
యువకుడి మృతదేహం లభ్యం
Published Thu, Nov 9 2023 2:24 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఐవోసీ లాభం సగానికి డౌన్
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
ధర పెరిగినా బంగారమే
కూటముల కురుక్షేత్రం
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement