శ్రామిక్‌ కాంగ్రెస్‌ కార్యకర్తల నిరసన | Sakshi
Sakshi News home page

శ్రామిక్‌ కాంగ్రెస్‌ కార్యకర్తల నిరసన

Published Thu, Dec 7 2023 1:18 AM

నిరసన తెలుపుతున్న కాంగ్రెస్‌ కార్యకర్తలు - Sakshi

భువనేశ్వర్‌: ఖుర్దారోడ్‌ రైల్వేస్టేషన్‌ ప్రాంగణంలో సిక్‌ లైన్‌ దుస్థితిపై తూర్పు కోస్తా రైల్వే శ్రామిక్‌ కాంగ్రెస్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ లైన్‌ నిర్వహణపై రైల్వే యంత్రాంగం నిర్లక్ష్యం దైనందిన కార్యకలాపాలకు అడ్డంకిగా పరిణమిస్తోందని ఆరోపించింది. బ్రిటిషు కాలం నాటి లైను నిర్వహణ బాధ్యతలను తూర్పు కోస్తా రైల్వే ఖుర్దారోడ్‌ యాంత్రిక శాఖ నిర్వహిస్తోంది. దీంతో సత్వర చర్యలకు ఆదేశించాలని ఓపెన్‌ లైన్‌ శాఖ కార్యదర్శి లక్ష్మీధర మహంతి ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం సీనియర్‌ ఇంజినీర్‌ చంద్రబాను నాయక్‌ను కోరింది.

Advertisement
Advertisement