Sakshi News home page

Published Wed, Mar 8 2023 1:06 AM

-

నగరంపాలెం: గుంటూరు నగరంలోని పోలీస్‌ పేరేడ్‌ మైదానంలో ఈనెల 13 నుంచి పోలీస్‌ కానిస్టేబుళ్ల అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ కె.ఆరిఫ్‌హఫీజ్‌ మంగళవారం మైదానంలో పర్యటించారు. పరుగు పందెం పోటీలు నిర్వహించేందుకు అనువుగా ఉండే స్థలాన్ని పరిశీలించారు. ఇతర పోటీల నిర్వహణపై పోలీస్‌ అధికారులతో చర్చించారు. అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పురుష/మహిళా అభ్యర్థుల సౌకర్యార్థం ఏర్పాటు చేయాల్సిన మౌలిక సౌకర్యాలపై చర్చించారు. మైదానంలో అక్కడక్కడ ఏపుగా పెరిగిన గడ్డిని తొలగించారు. ఎస్‌బీ సీఐ బి.నరసింహారావు, ఆర్‌ఐలు థామస్‌రెడ్డి, రమేష్‌ కృష్ణన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement