ఉద్యోగం ఇప్పిస్తానని రూ. 8.6 లక్షలు వసూలు | Sakshi
Sakshi News home page

ఉద్యోగం ఇప్పిస్తానని రూ. 8.6 లక్షలు వసూలు

Published Fri, Nov 10 2023 5:24 AM

-

అద్దంకి రూరల్‌: ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురి వద్ద నగదు తీసుకుని వారిని మోసగించిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై ఎం వెంకటేశ్వర్లు వివరాల మేరకు.. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఇనుమనమెల్లూరు గ్రామానికి చెందిన మందా నాగరాజు రైల్వేలో లోక్‌ పైలెట్‌గా పనిచేస్తుంటానని చెప్పాడు. అద్దంకి మండలంలోని బొమ్మనంపాడు గ్రామానికి చెందిన బండారు నాగరాజు మరో ఇద్దరికి రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానాని నమ్మించి వారి నుంచి రూ.8.6 లక్షలు నగదు తీసుకున్నాడు. ఎంత కాలానికి ఉద్యోగాలు ఇప్పించకపోవటంతో మోసపోయానని గమనించిన మందా నాగరాజు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈమేరకు శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement