బహుజన బ్రహ్మరథం
అమరేశ్వరుడు త్రిశూలధారియై డమరుకనాదం మోగించినట్టు.. బాలచాముండేశ్వరి చండీదేవియై లయబద్ధంగా నర్తించినట్టు.. నందీశ్వరుడు పరవశంతో రంకెలేసినట్టు.. ‘సంక్షేమం శరణం గచ్ఛామి’ అంటూ బౌద్ధారామం మంత్రోచ్ఛారణ చేసినట్టు.. కృష్ణమ్మ జలసిరులతో హొయలొలుకుతూ జనప్రవాహమై కదంతొక్కినట్టు.. అంబరాన ఉన్న అమరావతే ఔరా అంటూ అబ్బురపడినట్టు.. ఇల అమరావతి బహుజన జయజయధ్వానాలతో దద్దరిల్లింది. సర్వజన సారథీ.. సాహో అంటూ గళమెత్తింది. నవరత్న ప్రగతి ప్రదాతకు నీరాజనం పలుకుతూ కదిలిన జగన్మోహన రథచక్రాలకు బ్రహ్మరథం పట్టింది. దీపావళి పర్వదిన ముంగిట ‘నారా’కాసుర దండుపై సమరభేరి మోగించింది. దుష్టచతుష్టయంపై సింహగర్జన చేసింది.
మార్మోగిన జగన్నినాదం
● పోటెత్తిన అమరావతి
● అంబరాన్నంటిన ఉత్సాహం
● సామాజిక సాధికార బస్సు యాత్ర విజయవంతం
● ద్విచక్రవాహనాలతో యువకుల సందడి
● అడుగడుగునా నీరాజనం పలికిన ప్రజలు