అటల్‌ ల్యాబ్‌లలో టాస్క్‌ఫోర్స్‌ తనిఖీలు | Sakshi
Sakshi News home page

అటల్‌ ల్యాబ్‌లలో టాస్క్‌ఫోర్స్‌ తనిఖీలు

Published Sat, Nov 11 2023 1:40 AM

- - Sakshi

బాపట్ల అర్బన్‌: ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఆదేశాల మేకు రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్‌ బృందం శుక్రవారం బాపట్ల జిల్లాలోని ఎడ్లపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, శ్రీరామ రూరల్‌ కళాశాల, చిలుమూరు పాఠశాలల్లోని అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌లను తనిఖీ చేసింది. ల్యాబ్‌ల పనితీరు, విద్యార్థుల నైపుణ్యం, ఉపాధ్యాయుల నిర్వహణ విధానాలపై రిజిస్టర్లను పరిశీలించింది. విద్యార్థులు తయారుచేసిన వివిధ నమూనాలను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేసింది. కార్యక్రమంలో టాస్క్‌ టాస్క్‌ఫోర్స్‌ బృంద సభ్యులు డాక్టర్‌ మైన హుసేన్‌, గుంటూరు జిల్లా వైజ్ఞానికాధికారి ఎ.రవికుమార్‌, బాపట్ల జిల్లా వైజ్ఞానిక అధికారి ఎండీ సాదిక్‌, సంబంధిత పాఠశాలల అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌ ఇన్‌చార్జిలు, ప్రధానోపాధ్యాయులు, సైన్స్‌ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement