దేవరంపాడు వద్ద ఎకో పార్కుకు కేంద్రం అనుమతి | Sakshi
Sakshi News home page

దేవరంపాడు వద్ద ఎకో పార్కుకు కేంద్రం అనుమతి

Published Fri, Nov 17 2023 1:42 AM

స్థల పరిశీలన చేసి కొలతలు తీస్తున్న ఫారెస్టు అధికారులు  - Sakshi

రాజుపాలెం: దేవరంపాడు దేవస్థానం సమీపంలో ఎకో పార్కు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చినట్లు నరసరావుపేట ఫారెస్టు రేంజ్‌ అధికారి డీవీ రమణ తెలిపారు. పార్కు కోసం గురువారం అటవీ అధికారులు స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఫారెస్టు రేంజ్‌ అధికారి మాట్లాడుతూ దేవస్థానం వద్ద అభివృద్ధి పనులు, పార్కు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని తెలిపారు. చిల్ట్రన్స్‌ పార్కు, యాగశాల, పంచవటి వనం, నక్షత్రరాశి వనం ఏర్పాటుకు స్థలం పరిశీలించినట్టు వెల్లడించారు. భక్తులు పొంగళ్లు పొంగించేందుకు షెడ్‌, బాత్‌ రూమ్‌లు ఏర్పాటు చేస్తామని వివరించారు. అభివృద్ధి పనులకు కొలతలు తీశారు. కార్యక్రమంలో డెప్యూటీ రేంజ్‌ అధికారి నీలిమాదేవి, గుళ్లపల్లి ఫారెస్టు బీట్‌ అధికారి ఎస్‌.గోవిందరాజు, షైకింగ్‌ ఫోర్స్‌ మరియ దాసు బాషా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement