వనసమారాధనలతో ఆధ్యాత్మిక చింతన | Sakshi
Sakshi News home page

వనసమారాధనలతో ఆధ్యాత్మిక చింతన

Published Mon, Nov 20 2023 1:44 AM

మాట్లాడుతున్న జిల్లా ఎస్పీ రవిశంకర్‌రెడ్డి   - Sakshi

నరసరావుపేట రూరల్‌: ఆధ్యాత్మిక చింతనతోపాటు ఆనందం, ఆరోగ్య సందేశాన్ని కార్తిక వనసమరాధనలు చాటి చెబుతాయని జిల్లా ఎస్పీ పి.రవిశంకర్‌రెడ్డి తెలిపారు. కుంకలగుంట వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధర్యంలో 14వ కార్తిక వనసమారాధనను ఆదివారం రావిపాడు రోడ్డులోని కృష్ణచైతన్య కళాశాలలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ రవిశంకర్‌రెడ్డి, ఆత్మీయ అతిథులుగా పౌడా వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ గజ్జల శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర సివిల్‌ సప్లయీస్‌ కార్పొరేషన్‌ కృష్ణాజిల్లా మేనేజర్‌ డాక్టర్‌ అత్తలూరి శ్రీధర్‌లు హాజరయ్యారు. ఎస్పీ రవిశంకర్‌రెడ్డి మాట్లాడుతూ పట్టణంలో నివసిస్తున్న కుంకులగుంట గ్రామానికి చెందిన వారు గత 14 సంవత్సరాలుగా కార్తిక వనసమారాధనలు నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా స్నేహభావం పెరుగుతుందని తెలిపారు. డాక్టర్‌ గజ్జల బ్రహ్మరెడ్డి, కొల్లి బ్రహ్మయ్య, ఆతుకూరి వెంకటేశ్వర్లు, ఎస్‌కే సుభాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఆటల పోటీల్లో పెద్ద, చిన్నా ఉత్సాహంగా పాల్గొన్నారు.

జిల్లా ఎస్పీ రవిశంకర్‌రెడ్డి

Advertisement

తప్పక చదవండి

Advertisement