గుంటూరు డివిజన్‌ మీదుగా శబరిమలైకు ప్రత్యేక రైళ్లు | Sakshi
Sakshi News home page

గుంటూరు డివిజన్‌ మీదుగా శబరిమలైకు ప్రత్యేక రైళ్లు

Published Mon, Nov 20 2023 1:44 AM

-

లక్ష్మీపురం: దక్షిణ మధ్య రైల్వే శబరిమలై భక్తుల సౌకర్యార్ధం గుంటూరు డివిజన్‌ మీదుగా ప్రత్యేక రైళ్లను కేటాయించడం జరిగిందని డివిజన్‌ సీనియర్‌ డీసీఎం దినేష్‌కుమార్‌ ఆదివారం వెల్లడించారు. సికింద్రాబాద్‌–కొళ్లం(07219) ప్రత్యేక రైలును ఈనెల 26, డిసెంబర్‌ 3వ తేదీన గుంటూరు డివిజన్‌ మీదుగా కేటాయించడం జరిగిందని తెలిపారు. ఈ రైలు సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి సాయంత్రం 4.30 గంటలకు బయలు దేరి మరుసటి రోజు రాత్రి 11.55 గంటలకు కొళ్లం చేరుకుంటుందని తెలిపారు. అదేవిధంగా కొళ్లం–సికింద్రాబాద్‌(07130) రైలు ఈనెల 28, డిసెంబర్‌ 5వ తేదీల్లో డివిజన్‌ మీదుగా నడుస్తుందని తెలిపారు. ఈ రైలు కొళ్లం స్టేషన్‌ నుంచి అర్ధఽరాత్రి 2.30 గంటలకు బయలు దేరి మరుసటి రోజు ఉదయం 8.55 గంటలకు సికింద్రాబాద్‌ స్టేషన్‌కు చేరుకుంటుందని తెలిపారు. కాచిగూడ–కొళ్లం(07123) రైలు ఈనెల 22, 29 తేదీల్లో, డిసెంబర్‌ 6వ తేదీన గుంటూరు డివిజన్‌ మీదుగా ప్రయాణిస్తుందని తెలిపారు. కొళ్లం–కాచిగూడ(07214) రైలు ఈనెల 24, డిసెంబర్‌ 1, 8వ తేదీలలో డివిజన్‌ మీదుగా ప్రయాణిస్తుందని తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement