సంక్షేమానికి సీఎం వైఎస్‌ జగన్‌ ప్రాధాన్యం | Sakshi
Sakshi News home page

సంక్షేమానికి సీఎం వైఎస్‌ జగన్‌ ప్రాధాన్యం

Published Tue, Nov 21 2023 2:08 AM

లబ్ధిదారుకు ఇళ్ల పట్టా అందజేస్తున్న 
ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి 
 - Sakshi

ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి

పిడుగురాళ్ల రూరల్‌: ఏ ప్రభుత్వం చేయలేని పనిని జగనన్న ప్రభుత్వం చేసి చూపుతోందని ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి అన్నారు. మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీవాసులకు సోమవార ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ బ్రాహ్మణపల్లిలో ఎస్సీ కాలనీ ఏర్పడి 40 ఏళ్లు అవుతుందని ఇంత వరకు పట్టాలు ఇవ్వలేదని చెప్పారు. నాలుగు నెలల్లో పట్టాలు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ఈ పట్టా మీ హక్కుకు సూచిక అని, దీని ద్వారా మీ ఆస్తి విలువ పెరుగుతుందని అన్నారు. మెడికల్‌ కాలేజీ పూర్తి అయితే ఇంకా మీ ఇళ్ల స్థలాలకు మంచి రేటు వస్తుందని వివరించారు. అనంతరం 250 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ చక్రవర్తి, ఎంపీడీఓ కాశయ్య, పార్టీ మండల కన్వీనర్‌ చల్లా పిచ్చిరెడ్డి, ఎంపీపీ అల్లు పిచ్చిరెడ్డి సత్యవతి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు వీరభద్రుని రామిరెడ్డి, మండల అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు ముడేల వెంకటేశ్వరరెడ్డి, వైస్‌ ఎంపీపీ గార్లపాటి వెంకటేశ్వరరెడ్డి, సర్పంచి పి.వీర రాఘవయ్య, మాజీ సర్పంచి షేక్‌ ఖాశీంబి బడేషా, ఎంపీటీసీలు నాగిరెడ్డి, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Advertisement
Advertisement