నరసరావుపేట ఈస్ట్: ఉమ్మడి గుంటూరు జిల్లా పురుషులు, మహిళల ఖోఖో జట్ల వివరాలను సోమవారం కృష్ణవేణి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ నాతాని వెంకటేశ్వర్లు, వ్యాయామ అధ్యాపకుడు ఈదర ఆదిబాబు ప్రకటించారు. కళాశాలలో జిల్లా ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆది, సోమవారాలలో జిల్లా జట్ల ఎంపిక పోటీలు నిర్వహించి, అసోసియేషన్ అధ్యక్షుడు వీరబ్రహ్మారెడ్డి, కార్యదర్శి సిహెచ్.పుల్లయ్య సమక్షంలో జట్లు వివరాలు ప్రకటించారు. సెలక్షన్ కమిటీ సభ్యులుగా వ్యాయామ ఉపాధ్యాయులు జి.ఝాన్సీరాణి, సిహెచ్.చినరత్తయ్య, నరసింహారావు, పి.వెంకయ్య, ఎం.వెంకటేశ్వర్లు, ఏ.వీరాంజనేయులు వ్యవహరించారు.
పురుషుల జట్టు...
బి.అశోక్, షేక్.అల్లాభక్షు (కృష్ణవేణి డిగ్రీ కళాశాల), ఎం.వెంకటేష్, పి.వెంకటేశ్వరరెడ్డి, బి.నాగరాజు (యాజాలి), బి.సింహాద్రినాయక్, బి.స్వామినాయక్, ఆర్.శ్రీను (ఈపూరు), కె.శ్రీహరి (ముటుకూరు), సిహెచ్.శ్రీకాంత్, పి.గణేష్ (విజ్ఞాన్ యూనివర్సిటీ), పి.రవి (వడ్లపల్లి), కె.రాఘవేంద్ర (కారంపూడి), పి.సైద (విక్టరీ డిగ్రీ కళాశాల), పి.లిఖిత్
సాయిరామ్రెడ్డి (కేఎల్ యూనివర్సీటీ), స్టాండ్ బై కె.గోపి, పి.గోపినాథ్, ఎం.అవినాష్.
మహిళల జట్టు...
డి.లక్ష్మీప్రసన్న (డీఎస్ఆర్ కళాశాల), టి.లక్ష్మీప్రసన్న చంద్రిక, బి.సౌజన్య (జడ్పీ హైస్కూల్, శంకరభారతీపురం), ఎం.హేమలత, ఎం.శిరీషా, ఎ.రమ్య, బి.అలేఖ్య (కృష్ణవేణి డిగ్రీ కళాశాల నరసరావుపేట), ఎన్.శ్రీలక్ష్మి (ఐఐఐటీ, ఒంగోలు), ఎం.పూజిత (ఎన్ఈసీ, నరసరావుపేట), వి.లావణ్య (భావన డిగ్రీ కళాశాల, నరసరావుపేట), కె.అలేఖ్య (ఏఎన్యూ), బి.లక్ష్మీప్రసన్న, పి.తిరుమల (జడ్పీ హైస్కూల్, ఒప్పిచర్ల), కె.శ్రీలక్ష్మి, జి.తిరుపతమ్మ (నిట్, నరసరావుపేట), స్టాండ్బై సీహెచ్ అలేఖ్య, కె.అనూష, బి.వి.అఖిలను ఎంపిక చేశారు.