No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Tue, Nov 28 2023 2:22 AM

- - Sakshi

పెదకాకాని: కార్తిక పౌర్ణమి, సోమవారం సందర్భంగా పెదకాకాని భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి ఆలయం భక్తులతో పోటెత్తింది. వేకువ నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. తొలుత యజ్ఞాల బావి వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. కార్తిక దీపాలు వెలిగించారు. స్వామి, దేవేరులను దర్శించుకుని అభిషేకాలు చేశారు. పలువురు భక్తులు ప్రభలతో తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి, పాలకమండలి చైర్మన్‌ అమ్మిశెట్టి శివశంకరరావు, సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. పెదకాకాని సీఐ సురేష్‌బాబు బందోబస్తు నిర్వహించారు. ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్యశిబిరం నిర్వహించారు. కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి దంపతులు స్వామిని దర్శించుకున్నారు.

1/1

Advertisement
Advertisement