గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు | Sakshi
Sakshi News home page

గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు

Published Sat, Dec 23 2023 4:44 AM

వివరాలు వెల్లడిస్తున్న 
డీఎస్పీ ఉమామహేశ్వరరెడ్డి  
 - Sakshi

పట్నంబజారు: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. నగరంపాలెం పోలీసు స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెస్ట్‌ సబ్‌ డివిజన్‌ డీఎస్పీ బి.ఉమామహేశ్వరరెడ్డి, నగరంపాలెం సీఐ కె.మల్లికార్జునరావు వివరాలు వెల్లడించారు. పల్నాడు జిల్లా అమరావతి మండలం జిడుగు గ్రామానికి చెందిన దున్నా ప్రభుదాసు, గుంటూరు నగరంలోని కంకరగుంట ప్రాంతానికి చెందిన ఆరేతోటి నాగరాజు స్నేహితులు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో మరో స్నేహితుడు, కారు డ్రైవర్‌ ఫయాజ్‌తో కలసి ఐదు రోజుల కిందట విశాఖపట్నం జిల్లా పాడేరు వెళ్లారు. గుర్తు తెలియని వ్యక్తి వద్ద ముగ్గురు కలసి తొమ్మిది కిలోల గంజాయి కొని గుంటూరు తీసుకొచ్చారు. ప్యాకెట్‌లలో పెట్టి ఏటీఅగ్రహారం, భవానీపురంలోని రెడ్డి కళాశాల సమీపంలో విక్రయిస్తున్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ప్రభుదాస్‌, నాగరాజులను అదుపులోకి తీసుకుని, ఆరు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు ఫయాజ్‌ పరారీలో గాలిస్తున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. నిందితుల్ని పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన ఎస్‌ఐ రవీంద్రనాయక్‌, సిబ్బందిని అభినందించారు.

Advertisement
Advertisement