Sakshi News home page

‘సంగం’ ట్యాంకర్‌ ఢీ కొని యువకుడి మృతి

Published Thu, Mar 28 2024 1:40 AM

- - Sakshi

చేబ్రోలు: సంగం డెయిరీ పాల ట్యాంకర్‌ ఢీ కొని మెకానిక్‌ మృతి చెందిన ఘటన మండల పరిధిలోని వేజండ్ల అడ్డరోడ్డు వద్ద బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం తెనాలి చినరావూరుకు చెందిన అవ్వారు మోహన కృష్ణ(25) ద్విచక్ర వాహనంపై నారాకోడూరు వైపు నుంచి తెనాలికి వెళ్తున్నాడు. వేజండ్ల అడ్డరోడ్డు సమీపంలో తమిళనాడు నుంచి సంగం డెయిరీకి వెళ్తున్న సంగం డెయిరీ పాల వాహనం ప్రమాదవశాత్తూ ఢీ కొట్టింది. ఈ ఘటనలో యువకుడు మోహనకృష్ణ అక్కడికక్కడే మరణించాడు. మృతుడు మోహనకృష్ణ తెనాలిలో బైక్‌ మెకానిక్‌ పనిచేస్తున్నట్లు తెలిసింది. చేబ్రోలు ఎస్‌ఐ పి.మహేష్‌ కుమార్‌ ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదఘటన విషయాలను నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

What’s your opinion

Advertisement