జెండా ఎగురవేస్తాం.. జగనన్నకు కానుకగా ఇస్తాం | Sakshi
Sakshi News home page

జెండా ఎగురవేస్తాం.. జగనన్నకు కానుకగా ఇస్తాం

Published Tue, Apr 23 2024 8:25 AM

-

● చిలకలూరిపేట వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి కావటి శివనాగ మనోహర నాయుడు

చిలకలూరిపేట: ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో విజయం సాధించి, నియోజకవర్గంలో వైఎస్సార్‌ సీపీ జెండా ఎగురవేసి జగనన్నకు కానుకగా ఇస్తామ ని పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్‌ నాయుడు చెప్పారు. సోమవారం నామినేషన్‌ దాఖ లు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కనీవిని ఎరుగని స్థాయిలో అభివృద్ధి, సంక్షేమం అందించిన ముఖ్యమంత్రి జగన్‌ తిరిగి అధికారం సాధించాలని ప్రజలు ప్రతినబూనారని చెప్పారు. దీనికి ప్రజల నుంచి లభిస్తున్న అపూర్వ ఆదరణే నిదర్శమన్నారు. ఎన్నికల ప్రచారం నిర్వ హిస్తుంటే ప్రతి గడపలోనూ ప్రజలు సీఎం వైఎస్‌ జగన్‌ తమను ఎన్నో రకాలుగా ఆదుకున్నారని తెలుపుతున్నారని వెల్లడించారు. గత ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసిన వారు సైతం మాకు ఇళ్ల పట్టాలు వచ్చాయి... ఆరోగ్యశ్రీ ద్వారా మేలు జరిగింది... ఎన్నో పథకాలు అందుతున్నాయి, ఈసారి వైఎస్సార్‌ సీపీకే ఓటు వేస్తాం అని చెబుతున్నారని పేర్కొన్నారు.

బెదిరింపులు సహించం...

కొంతమంది టీడీపీ నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం ఉందని, అలాంటి వారికి తగు రీతిలో గుణపాఠం చెబుతామని కావటి హెచ్చరించారు. టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లా రావు మాటలు నమ్మి దౌర్జన్యాలకు దిగితే తగిన ప్రతిఫలం అనుభవించక తప్పదన్నారు. దీని కి నిదర్శనం 2019లో ఓటమి చెందాక ప్రత్తిపాటి పుల్లారావు నియోజకవర్గానికి నాలుగున్నర సంవత్సరాలు దూరంగా ఉన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. 2019 తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలను సైతం గాలికి వదిలేసిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. పుల్లారావు, ఆయ న సతీమణి చేసిన అరాచకాలు, అవినీతి నియోజకవర్గ ప్రజలు ఎప్పటికీ మరిచిపోరన్నారు. గుడ్డిపత్తి అమ్ముకొనేందుకు ప్రకాశం జిల్లా బొబ్బేపల్లి నుంచి వచ్చిన ప్రత్తిపాటి ఇక్కడి ప్రజల నెత్తిన టోపీ పెట్టి గతంలో ఎమ్మెల్యేగా గెలిచారని, టీడీపీ ఓడిపోవడం ఖాయమని, ఆ తర్వాత పుల్లారావు కనిపించే పరిస్థితి ఉండదని, ఆయనను నమ్ముకుంటే నట్టేట మునగడం ఖాయమన్న విషయం ఆ పార్టీ నాయకులకు కూడా తెలుసన్నారు. అయినప్పటికీ బెదిరింపులకు దిగడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు.

Advertisement
Advertisement