పుష్పాలంకరణలో పైడితల్లి | Sakshi
Sakshi News home page

పుష్పాలంకరణలో పైడితల్లి

Published Wed, May 17 2023 12:34 AM

అమ్మవారిని దర్శించుకుంటున్న భక్తులు - Sakshi

విజయనగరం టౌన్‌: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు పుష్పాలంకరణలో మంగళవారం భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ ఆధ్వర్యంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా పూజాదికాలు చేశారు. ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్‌, మూలాపాపారావులు కుంకుమార్చన నిర్వహించారు. మహిళలు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలను సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయం వెనుక ఉన్న వేప, రావి చెట్ల వద్ద దీపారాధన చేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించి, తరించారు. కార్యక్రమాలను ఆలయ ఈఓ కేఎల్‌.సుధారాణి పర్యవేక్షించారు.

ప్రత్యేక పుష్పాలంకరణలో పైడితల్లి అమ్మవారు
1/1

ప్రత్యేక పుష్పాలంకరణలో పైడితల్లి అమ్మవారు

Advertisement

తప్పక చదవండి

Advertisement