వరుణ్‌ మారుతీతో ఐటీఐ ఒప్పందం | Sakshi
Sakshi News home page

వరుణ్‌ మారుతీతో ఐటీఐ ఒప్పందం

Published Wed, Aug 30 2023 2:36 AM

ఒప్పందపత్రాన్ని అందజేస్తున్న జేసీ మయూర్‌ అశోక్‌ - Sakshi

విజయనగరం అర్బన్‌: జిల్లాలోని ప్రభుత్వ ఐటీఐకి వరుణ్‌ మారుతితో డీజిల్‌ మెకానిక్‌ ట్రైనీల శిక్షణకు సంబంధించిన ఒప్పందం కుదిరింది. ఈ మేరకు మంగళవారం జేసీ మయూర్‌ అశోక్‌ సమక్షంలో ఈ ఒప్పందం చేసుకున్నట్లు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్‌ టీవీగిరి తెలిపారు. కార్యక్రమంలో వరుణ్‌ గ్రూప్‌ జనరల్‌ మేనేజర్‌ (సర్వీసెస్‌) శ్రీనివాస్‌ రెడ్డి, ట్రైనింగ్‌ ప్రిన్సిపాల్‌ సత్యనారాయణ, జిల్లా మేనేజర్‌ కిరణ్‌, ట్రైనింగ్‌ ఆఫీసర్‌ రామాచారి పాల్గొన్నారు. ఈ ఒప్పందం వల్ల శిక్షణ కాలంలో ఉన్నప్పుడే ఐటీఐ డీజిల్‌ మెకానిక్‌ విద్యార్థులకు 3 నెలల కాలం వరుణ్‌లో ప్రత్యేక శిక్షణ పొందే అవకాశం కలుగుతుంది. వరుణ్‌ నుంచి కూడా ట్రైనర్స్‌ వచ్చి విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు, ప్రాక్టికల్స్‌ కోసం ఎక్విప్‌మెంట్‌ సపోర్ట్‌ కూడా కలుగుతుందని తెలిపారు.

Advertisement
Advertisement