జాతీయ స్థాయి పోటీలకు గురుకుల విద్యార్థి | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయి పోటీలకు గురుకుల విద్యార్థి

Published Fri, Nov 10 2023 5:08 AM

విద్యార్థిని అభినందిస్తున్న ప్రిన్సిపాల్‌ తదితరులు - Sakshi

సాలూరు: మండలంలో పీఎన్‌ బొడ్డవలస అంబేడ్కర్‌ గురుకులం పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న జనార్దన్‌సాయి డిసెంబర్‌లో రాజస్తాన్‌లో జరిగే జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలకు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్‌ శ్రీరాములు గురువారం తెలిపారు. ఈ నెల 4 నుంచి 6 వరకు ఒంగోలు, ప్రకాశం జిల్లాల్లో జ రిగిన అండర్‌ 17 సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో విజయనగరం జట్టు తృతీయ స్థానంలో నిలవగా, జట్టులో ఉన్న జనార్దన్‌సాయి ప్రతిభ కనబర్చాడని తెలిపారు. జనార్దన్‌సాయిని జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్టు అధికారులు ప్రకటించారని పేర్కొన్నారు. విద్యార్థిని పీడీ విద్యాసాగర్‌, పీఈటీ నాయుడు, పాఠశాల సిబ్బంది అభినందించారు.

Advertisement
Advertisement