రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో జిల్లా జట్ల సత్తా | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో జిల్లా జట్ల సత్తా

Published Tue, Nov 21 2023 2:06 AM

బాలికల జట్టు - Sakshi

బొబ్బిలి: గుంటూరు జిల్లా వెలిగండ్లలో ఈనెల 18,19,20 తేదీల్లో జరిగిన అండర్‌ –14 రాష్ట్రస్థాయి సాఫ్ట్‌ బాల్‌ పోటీల్లో విజయనగరం జిల్లా బాలికలు, బాలుర జట్లు ప్రథమ స్థానం సాధించినట్లు కోచ్‌, మేనేజర్‌లు సత్యనారాయణ, అప్పలనాయుడులు తెలిపారు. గెలుపొందిన జట్లు వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో జరిగే జాతీయ పోటీలకు ఎంపికై నట్లు చెప్పారు. జిల్లా జట్లలో 11 మంది బొబ్బిలి మండలం పారాదిలోని జెడ్పీఉన్నత పాఠశాల క్రీడాకారులేనని పీడీ ఎన్‌ వెంకటనాయుడు తెలిపారు. జయశ్రీ,మాన్విత, నాని, మోహన్‌ సాయి, పవన్‌లు పారాదిలో చదువుతున్నారని, మిగతా వారు ఆరికతోట పాఠశాలలో చదువుతున్నారన్నారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు జాతీయస్థాయికి ఎంపికవడం పట్ల పారాది హెచ్‌ఎం నాగేశ్వరరావు అభినందించారు.

ప్రథమస్థానంలో నిలిచిన బాలురు, బాలికలు

బాలుర జట్టు
1/1

బాలుర జట్టు

Advertisement
Advertisement