ఫ్యాన్‌ ప్రభంజనం ఖాయం | Sakshi
Sakshi News home page

ఫ్యాన్‌ ప్రభంజనం ఖాయం

Published Wed, Apr 10 2024 1:30 AM

- - Sakshi

రేగిడి: త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాన్‌ గుర్తు ప్రభంజనం సృష్టించనుందని శాసనమండలిలో ప్రభుత్వ విప్‌ పాలవలస విక్రాంత్‌ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన రాజాం మండలంలోని ఉంగరాడమెట్ట వద్ద రాజాం ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ తలే రాజేష్‌తో కలిసి వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటినుంచి ఎన్నో సంక్షేమ పథకాలు అమలుచేశారన్నారు. గత పాలనలో చంద్రబాబు మోసాలతోనే కాలక్షేపం జరిగిందని, ఇప్పుడు మళ్లీ కూటమి పేరుతో ప్రజలను మోసగించేందుకు సిద్ధమవుతున్నారన్నారు. ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ కూటమిని నమ్మవద్దని కోరారు. ఎన్నికల వేళ లేనిపోని హామీలు ఇచ్చి మోసగిస్తారని హెచ్చరించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ క్షేత్ర స్థాయిలో బలమైన పునాదులు వేసుకుందని, ఎన్నికల వేళ ప్రతి మండలంలో పార్టీ కార్యాలయాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ తలే రాజేష్‌ మాట్లాడుతూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయానికి తిరుగులేదని, తనను రాజాం నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ గేదెల వెంకటేశ్వరరావు, ఎంపీపీ దార అప్పలనరసమ్మ, వైస్‌ ఎంపీపీ టంకాల అచ్చెన్నాయుడు, పార్టీ మండల అధ్యక్షుడు వావిలపల్లి జగన్మోహనరావు, జేసీఎస్‌ కన్వీనర్‌ కింజరాపు సురేష్‌, రేగిడి పీఏసీఎస్‌ అధ్యక్షుడు వంజరాపు అశోక్‌, మాజీ అధ్యక్షులు నెల్లి పెంటన్నాయుడు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ప్రభుత్వ విప్‌ పాలవలస విక్రాంత్‌

Advertisement
Advertisement