Sakshi News home page

30న అంబేడ్కర్‌ జయంతి ఉత్సవ కమిటీ ఏర్పాటు

Published Sun, Mar 26 2023 1:06 AM

మాట్లాడుతున్న దళిత సంఘాల ప్రతినిధులు
 - Sakshi

సుల్తానాబాద్‌(పెద్దపల్లి): ఏప్రిల్‌ 14న అంబేడ్కర్‌ జయంతి ఉత్సవాల నిర్వహణకు సంబంధిత కమిటీని ఈ నెల 30న ఏర్పాటు చేస్తున్నట్లు దళిత సంఘాల ప్రతినిధులు తెలిపారు. శనివారం సుల్తానాబాద్‌ పట్టణంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 30న ఉదయం 10 గంటలకు స్థానిక అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఏర్పాటు చేసే సమావేశానికి సుల్తానాబాద్‌ పట్టణంతోపాటు అన్ని గ్రామాల ప్రజలు, పార్టీల నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, దళిత సంఘాల నాయకులు హాజరు కావాలని కో రారు. ఎంపీటీసీ సభ్యుడు శీలం శంకర్‌, నా యకులు న్యాతరి శ్రీనివాస్‌, తిప్పారపు ద యాకర్‌, న్యాతరి ప్రభాకర్‌, చుక్క రాజమౌళి, క్యాదాసి చంద్రమౌళి పాల్గొన్నారు.

Advertisement
Advertisement