కొండాను గెలిపించండి
కందుకూరు: చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి విజయానికి నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జీ.కిషన్రెడ్డి పిలుపునిచ్చారు. కందుకూరు మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి పలువురు నాయకులు బుధవారం ఆయన సమక్షంలో బీజేపీలో చేరారు. లేమూరు ఎంపీటీసీ సభ్యుడు యాదయ్య, ఆ గ్రామ బీఆర్ఎస్ నాయకులు శ్రీకాంత్రెడ్డి, నారాయణరెడ్డి, అగర్మియాగూడ మాజీ ఉపసర్పంచ్ ఆదీబ్ తదితరులు పార్టీలో చేరినవారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ దేవేందర్రెడ్డి, సీనియర్ నాయకులు భిక్షపతి, జగదీశ్వర్రెడ్డి, ఆంజనేయులు, యాదగిరిరెడ్డి, నారాయణ, వెంకటేశ్, బాలకృష్ణ, శ్రీకాంత్, రవీందర్రెడ్డి, రాజు, రాఘవేందర్, ఆకాష్రెడ్డి, నారాయణ పాల్గొన్నారు.
శంషాబాద్లో
బీఆర్ఎస్కు షాక్
కాంగ్రెస్లో చేరిన కారు పార్టీ కౌన్సిలర్లు
శంషాబాద్ : లోక్సభ ఎన్నికల నేపథ్యంలో శంషాబాద్లో బీఆర్ఎస్కు ఎదురుదెెబ్బ తగిలింది. మాజీ మంత్రి కేటీఆర్ రోడ్షో సక్సెస్ అయిందన్న సంతోషంలో ఉన్న బీఆర్ఎస్కు మరుసటిరోజే కౌన్సిలర్లు షాకిచ్చారు. చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ రంజిత్రెడ్డి ఆధ్వర్యంలో 2వ వార్డు కౌన్సిలర్ భద్రునాయక్, 22 కౌన్సిలర్ ఎం.శ్రీకాంత్యాదవ్, 23వ వార్డు కౌన్సిలర్ శ్రవంత్శ్రీకాంత్రెడ్డి, 13వ వార్డు కౌన్సిలర్ బండి భాగ్యలక్ష్మి, 5వ వార్డు కౌన్సిలర్ మస్రజ్జాతాజ్బా సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఇటీవల సీఎం రేవంత్రెడ్డి రోడ్షోలో 15వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సంజయ్యాదవ్, పీసీసీ ఎస్సీసెల్ ఉపాధ్యక్షుడు జల్లపల్లి నరేందర్ పాల్గొన్నారు.
బీఆర్ఎస్తోనే
బీసీలకు గుర్తింపు
పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని
హుడాకాంప్లెక్స్: బీఆర్ఎస్ పార్టీతోనే బీసీలకు గుర్తింపు ఉంటుందని ఆ పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్నారు. బుధవారం సరూర్నగర్ డివిజన్లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాసాని మాట్లాడుతూ.. ఉచితాల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెడుతోందని విమర్శించారు. పార్లమెంటులో తెలంగాణ సమస్యలు, బీసీల గళం వినిపించాలంటే బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ ఎంపీ సీట్లు గెలిపించాలని కోరారు. సబితారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వానికి అతి తక్కువ కాలంలోనే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిందని అన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి జ్ఞానేశ్వర్ను గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నాయకులు గోపాల్, అంకిరెడ్డి, అరవింద్కుమార్, జహీర్, రుషిగుప్తా, సలీం, కొండల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కళాశాలను తరలించుకుపోయారు..
కందుకూరు: బీఆర్ఎస్ హయాంలో తాము కందుకూరులో శంకుస్థాపన చేసిన మెడికల్ కళాశాల, ఆస్పత్రులను.. అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం రేవంత్రెడ్డి ఇక్కడ నిర్మించకుండా రద్దుచేసి కొడంగల్ తరలించుకుపోయారని మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి ఆరోపించారు. బుధవారం రాత్రి కందుకూరులో శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ముదిరాజ్తో కలిసి నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫార్మాసిటీ ఏర్పాటుకు భూములు సేకరిస్తే... కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫార్మాసిటీని రద్దు చేసిందని.. దీంతో ఈ ప్రాంతంలో భూముల ధరలు పడిపోయాయన్నారు. కాసాని జ్ఞానేశ్వర్కు ఓటువేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జయేందర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సురేందర్రెడ్డి, ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మీనర్సింహారెడ్డి, అంజయ్యగౌడ్, దశరథ, పీఏసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్, వర్కింగ్ ప్రెసిడెంట్ మేఘనాథ్రెడ్డి, మహిళా నాయకురాలు జయమ్మ తదితరులు పాల్గొన్నారు.