గోదావరిఖని/రామగుండం: రామగుండం ఎమ్మె ల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ బుధవారం సీఎం రేవంత్ రెడ్డితో కలిసి అసెంబ్లీలో పర్యటించారు. అసెంబ్లీ చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించారు.
నిషేధిత వస్తువులు తరలించొద్దు
రామగుండం: రైళ్లలో నిషేధిత కిరోసిన్, పెట్రోల్, గ్యాస్తోపాటు నల్లబెల్లం, కలప, మద్యం అక్రమంగా తరలిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని రై ల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సీఐ సురేశ్గౌడ్ హెచ్చరించారు. బుధవారం స్థానిక రైల్వేస్టేషన్లో తనిఖీలు చేశారు. పెద్దంపేట రైల్వేస్టేషన్లోనూ సోదాలు చేశారు. ని బంధనలు అతిక్రమించినందుకు ఈ ఏడాదిలో 2,270 కేసులు నమోదు చేశామని సీఐ తెలిపారు.