అవనిగడ్డ: చంద్రబాబు ఏడ్చినప్పుడే టీడీపీ పని అయిపోయిందని, ఏడ్చేవారు రాజకీయాలకు పనికి రారని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. శనివారం రాత్రి కృష్ణా జిల్లా అవనిగడ్డలో నలుగురు నూతన మంత్రులకు ఆత్మీయ సన్మానం జరిగింది. ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, మేరుగ నాగార్జున, జోగి రమేష్, వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నానిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ తానేమీ అనకపోయినా ఏదో అన్నట్టు చంద్రబాబు ఏడ్చారని అన్నారు. గెలుపు ఓటములు, ఒడుదొడుకులు వచ్చినా హీరోలా ఉండేవారే రాజకీయాల్లో ఉంటారని చెప్పారు.
జగన్ వ్యతిరేక శక్తులందరినీ విడిపోనివ్వనని పవన్ కల్యాణ్ ప్రగల్భాలు పలుకుతున్నారని, ఆయన సీఎం అవడానికి పార్టీ పెట్టారో, చంద్రబాబుని సీఎం చెయ్యడానికి పార్టీ పెట్టారో ముందు తేల్చుకోవాలని అన్నారు. అమర్నాథ్ మాట్లాడుతూ 2024లో మళ్ళీ జగన్ని సీఎంని చేసేందుకు అందరం కలిసికట్టుగా పనిచేద్దామన్నారు. మేరుగ మాట్లాడుతూ ఒక్క రూపాయి కూడా అవినీతికి ఆస్కారం లేకుండా రాష్ట్రంలో ఇప్పటివరకూ రూ.1.32 లక్షల కోట్లు సంక్షేమ కార్యక్రమాలకు సీఎం ఖర్చుపెట్టారని చెప్పారు. జోగి రమేష్ మాట్లాడుతూ కుల, మత, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తున్న సీఎం మిగతా రాష్ట్రాల సీఎంలకు ఆదర్శంగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బాలశౌరి, కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషుబాబు, ఎంఎస్ఎంఈ చైర్మన్ రవీంద్రనాథ్, అమెరికాలో ఏపీ ప్రత్యేక ప్రతిని«ధి పి.రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఏడ్చే వారు రాజకీయాలకు పనికిరారు
Published Sun, May 1 2022 4:21 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement