AP Elections Political Latest Updates Telugu..
8:05 PM, Jan 25, 2024
చంద్రబాబుకు మంత్రి జోగి రమేష్ ఛాలెంజ్
- పెనమలూరులో నా పై పోటీ చేసే దమ్ముందా?
- చంద్రబాబు సర్వేలు కూడా చేయించుకున్నాడు
- ఎవరు పోటీ చేసినా గెలిసేది నేనే
- ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా జగన్ను ఎదుర్కోలేరు
- ప్రతిపక్షాలను కృష్ణా నదిలో కలిపేస్తాం
- ప్రజల గుండెల్లో జగన్ నిలిచిపోయారు
- ఢిల్లీలో కాంగ్రెస్ పీఠాన్ని వణికించిన ధీరుడు జగన్మోహన్రెడ్డి
- సోనియా గాంధీ, రాహుల్ గాంధీ జగన్పై కుట్రలు చేస్తున్నారు
- చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తాడు.. కాంగ్రెస్ ముందుపోటు పొడుస్తుంది
- 2024లో 175 స్థానాలు గెలుస్తాం
- పెనమలూరు గడ్డ వైఎస్సార్సీపీ అడ్డా
7:35 PM, Jan 25, 2024
వంగవీటి రంగా విగ్రహానికి దండ కూడా వేయని వ్యక్తి పవన్ కళ్యాణ్: అడపా శేషు
- పవన్కు, చంద్రబాబు కావాల్సిందే సీఎం కుర్చీ మాత్రమే
- అధికారంలోకి రావడానికి ఏం చేయడానికైనా వెనుకాడరు
- కుటుంబాల మధ్య చిచ్చు పెట్టగలరనడానికి ఉదాహరణే షర్మిల
- పార్టీ పెట్టి పదేళ్లైనా కార్యకర్తలకు పదవులు ఇచ్చుకోలేని వ్యక్తి పవన్ కళ్యాణ్
- జగన్మోహన్రెడ్డి ఎంతో మందికి పదవులిచ్చి సముచిత స్థానం కల్పించారు
- మనం నోరు విప్పాల్సిన సమయం ఆసన్నమైంది
- సీఎం జగన్ వల్ల జరిగిన అభివృద్ధిని అందరికీ చెప్పాలి
6:53 PM, Jan 25, 2024
చంద్రబాబుపై ఎంపీ కేశినేని నాని ఫైర్
- చంద్రబాబు రాజకీయ సమాధికి తిరువూరులో జనవరి 3నే పునాది పడింది
- తిరువూరులో నాపై, స్వామిదాస్పైకి లోకేష్ గూండాలను పంపాడు
- చంద్రబాబు కోసం నేను అమ్ముకున్న ఆస్తుల విలువ రూ.2వేల కోట్లు
- సీఎం జగన్ పేదవాడిని ధనికుడిని చేశారు
- ఎంపీగా నా భావజాలం సీఎం జగన్ భావజాలం ఒక్కటే.. ముక్కు సూటితనం
- విజయవాడలో 206 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించి నిజమైన అంబేద్కర్ వాదిగా సీఎం జగన్ నిలిచారు
- చంద్రబాబుకు రోడ్లు కావాలి.. ఫైవ్ స్టార్ హోటల్స్ కావాలి
- సీఎం జగన్కు పేదవాడి కడుపుమంట తీర్చి వారిని ధనికుల్ని చేయడం కావాలి
- లోకేష్ కోసం చంద్రబాబు అమరావతి నిర్మించాడు
- చంద్రబాబు 100 కోట్లు కూడా విజయవాడ అభివృద్దికి ఇవ్వలేదు
- తిరువూరులో స్వామి దాస్ను 20వేల ఓట్ల మెజారిటీతో గెలుపించుకోవాలి
- త్వరలోనే కట్టలేరు బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తాం
6:26 PM, Jan 25, 2024
రాజోలు టీడీపీలో మరోసారి బయట పడ్డ వర్గ విభేదాలు
- నారా భువనేశ్వరి పర్యటనలో మహిళా సర్పంచ్కు అవమానం
- రాజోలు మండలం శివకోడు నారా భువనేశ్వరిని కలవడానికి వచ్చిన తాటిపాక సర్పంచ్ కోటిపల్లి రత్నమాల
- ఆమెను లోపలికి రానివ్వకుండా తోసేసిన గొల్లపల్లి సూర్యారావు వర్గీయులు
- ఇటీవల రాజోలులో జరిగిన లోకేష్ పాదయాత్ర లో సర్పంచ్ రత్నమాల ప్లెక్సీలను చించేసిన గొల్లపల్లి వర్గం
- అప్పట్లో ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్న టీడీపీ నేతలు
5:27PM, Jan 25, 2024
రాజధాని లేదంటే దానికి కాంగ్రెస్ పార్టీయే కారణం: వైవీ సుబ్బారెడ్డి
- రాష్ట్రాన్ని అడ్డుగోలుగా కాంగ్రెస్ విభజించింది.
- అటు వంటి కాంగ్రెస్ పార్టీలో చేరి మాట్లాడడం సమాజసం కాదు..
- వైఎస్ కుటుంబాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టిందో దేశం మొత్తం తెలుసు..
- కాంగ్రెస్, చంద్రబాబు కుమ్మకై జగన్ను జైల్లో పెట్టారు
- మాకు కాంగ్రెస్ అసలు పోటీనే కాదు.
5:25PM, Jan 25, 2024
పార్టీ పరంగా ఉన్న వారు అందరూ బహిరంగ సభకు హాజరువుతారు: మంత్రి బొత్స సత్యనారాయణ
- దుష్ట శక్తుల కుట్రలను అడ్డుకొనేందుకు సభ జరగనుంది
- ప్రజలకు చేసిన మంచిని సీఎం జగన్ వివరిస్తారు
- రాబోయే రోజుల్లో ఎలా పోరాటం చేయాలో సీఎం జగన్ సూచిస్తారు
- ప్రజలకు చేసిన మంచిని వివరిస్తారు
- మీరు సంతృప్తి పడితేనే ఓటు వేయండి అని సీఎం జగన్ దైర్యంగా చెపుతున్నారు
- చంద్రబాబులా మాయమాటలు చెప్పడం సీఎం జగన్కు తెలియదు
- రాష్ట్రంలో ఓటు హక్కు లేని వారు మాట్లాడుతున్నారు
- ఉత్తరాంధ్రలో అభివృద్ధి జరిగింది అంటే దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి, ఆయన కుమారుడు వైఎస్ జగన్ హయంలోనే జరిగింది
- విద్య వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారు
- దేశం మొత్తం రాష్ట్రం వైపు చూస్తుంది
- ప్రజల సీఎం జగన్ పాలనపై ఒక ఆలోచన చేయాలి
- 27 తేదీన జరిగే బహిరంగ విజయ వంత మవుతుంది
- భగవంతుని ఆశీస్సులు సీఎం జగన్కు ఉన్నాయి.
2:40PM, Jan 25, 2024
షర్మిలకు జగన్ ఏం అన్యాయం చేశారో ఆమెనే చెప్పాలి: సజ్జల
- రాష్ట్ర రాజకీయాలపై షర్మిలకు అవగాహన లేదు
- ఆమె వ్యాఖ్యలకు పొంతన ఉండటం లేదు
- జగన్కి చెల్లెలుగా, వైఎస్సార్కి కూతురిగా మాత్రమే ప్రజలకు షర్మి ల తెలుసు
- కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ ఫ్యామిలీని ఎంతగా వేధించిందీ షర్మిలకు తెలుసు
- తనకి జగన్ ఏం అన్యాయం చేశారో షర్మిల స్పష్టంగా చెప్పాలి
- ప్రజాస్వామ్యంలో పదవులు అన్నీ కుటుంబానికే ఇస్తారా?
- షర్మిల మాట్లాడిన ప్రతీదానికి సమాధానం చెప్పాల్సిన పనిలేదు
- వైఎస్ జగన్పై కాంగ్రెస్ అక్రమ కేసులు పెట్టింది
- 16 నెలలు జైల్లో పెట్టారు
- వైఎస్సార్ను ప్రేమించిన ప్రతీ గుండె జగన్ను ఆదరించారు
- కాంగ్రెస్ పెట్టింది అక్రమ కేసులని.. ఆ పార్టీ నేతలే చెప్పారు
- జగన్ అంతు చూడాలని కాంగ్రెస్ అనేక ప్రయత్నాలు చేసింది
- చంద్రబాబు రాయించిన స్క్రిప్ట్ను షర్మిల చదువుతున్నారు
- తెలంగాణలో పార్టీ కోసం పని చేసిన వారికి షర్మిల ఏం న్యాయం చేశారు
- తెలంగాణ కాంగ్రెస్ నేతలు షర్మిలను ఎందుకు వద్దన్నారు
- రాజ్యసభ ఎన్నికల్లో మూడు స్థానాలు మేము గెలుస్తాం
- 19 మంది ఎమ్మెల్యేలతో టీడీపీ ఎలా గెలుస్తోంది
- టీడీపీకి తగినంత సంఖ్యా బలం లేదు
- అనర్హత వేటు అన్నది పూర్తిగా స్పీకర్ నిర్ణయం
- గంటా రాజీనామా ఆమోదం స్పీకర్ నిర్ణయం
- విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్ర పరిధిలో ఉన్న అంశం
1:20 PM, Jan 25, 2024
అందరం కలిసికట్టుగా పనిచేసి వైఎస్సార్సీపీని గెలిపిస్తాం: సజ్జల
- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో మరోసారి వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం ఖాయం.
- పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పార్టీ విజయం కోసం కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి.
- ఈ నెల 27 నుంచి వరుస సభలు ఉంటాయి. శనివారం భీమిలిలో సీఎం జగన్ తొలి సభ ఉంటుంది.
- సీఎం జగన్ పేద ప్రజల పక్షపాతి.
- అధికారం అంటే బాధ్యతగా భావించిన నాయకుడు వైఎస్ జగన్.
- వైఎస్సార్సీపీలో అందరూ కార్యకర్తలే.
- వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలు గెలవడమే లక్ష్యం.
- కుల, మత, రాజకీయాలకు అతీతంగా.. పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందించాం.
- అవినీతికి తావులేకుండా లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమచేస్తున్నాయన్నారు.
- ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసిన నాయకుడు జగన్.
1:05 PM, Jan 25, 2024
గంటా శ్రీనివాస్పై పేర్ని నాని సెటైర్లు
- రాజీనామాపై గంటా శ్రీనివాస్ అనవసర రాద్ధాంతం చేస్తున్నాడు
- గంట న్యాయపోరాటాన్ని ఎవరు ఆపటం లేదు
- గంటా శ్రీనివాసరావు నాయకత్వం టీడీపీకే అవసరం లేదు
- టీడీపీలోనే టికెట్ లేక అనవసర ఆరాటాన్ని సృష్టిస్తున్నాడు
- షర్మిల ఎక్కడి వ్యక్తి అనేది స్పష్టతనివ్వాలి
- నాడు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేసి నేడు అదే పార్టీకి సారథ్యం వహించటంలోనే ఆమె వైఫల్యం తెలుస్తోంది
12:45 PM, Jan 25, 2024
ఎల్లో బ్యాచ్కు మంత్రి జోగి రమేష్ కౌంటర్
- ఏలూరులో జనవరి 30వ తేదీన జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని కార్యకర్తలకు జోగి రమేష్ పిలుపు
- గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులందరికీ ఆహ్వానాలు
- గడచిన ఐదు సంవత్సరాల వైఎస్సార్సీపీ పాలనపై ముఖ్యమంత్రి జగన్ ప్రసంగం సాగుతుంది
- చంద్రబాబు, పవన్, మరే ఇతర పార్టీలు అందరూ కలిసి వచ్చిన సీఎం జగన్ ఒకరే వారికి సమాధానం చెప్పగలరు
12:30 PM, Jan 25, 2024
అభివృద్ధి పనులు ప్రజలకు తెలియాలి: బొత్స సత్యనారాయణ
- వైఎస్సార్సీపీ పాలనలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాం
- మన ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు తెలియజేయాలి.
- పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత కట్టుబడి పనిచేయాలి.
12:05 PM, Jan 25, 2024
వెల్లంపల్లి ఆఫీస్కు మల్లాది
- విజయవాడ సెంట్రల్లో వైఎస్సార్సీపీ సంబురాలు
- మల్లాది, వెల్లంపల్లి ఆత్మీయ ఆలింగనం
- సెంట్రల్లో కొత్త ఆఫీస్ కార్యక్రమానికి హాజరైన మల్లాది విష్ణు
- తన ఆఫీస్ నుంచి వెల్లంపల్లి ఆఫీస్కు ర్యాలీగా వెళ్లిన మల్లాది
- విజయవాడ సెంట్రల్లో ముసలం అంటూ యెల్లో మీడియా కథనాలు
- ఒక్క హగ్తో చెక్పెట్టిన మల్లాది
11:55 AM, Jan 25, 2024
ప్రజలు జగన్ను తప్ప ఎవరినీ నమ్మే పరిస్థితిలో లేరు
- ఈ నెల 27న భీమిలిలో వైఎస్ఆర్ సీపీ ఎన్నికల శంఖారావం
- సభా ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి గుడివాడ అమర్నాథ్
- చంద్రబాబు, పవన్ హామీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు
- సీఎం జగన్ మాట ఇస్తే తప్పరు అని ప్రజలు నమ్ముతున్నారు
- ఏపీకి కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని ప్రజలు ఇంకా మరచిపోలేదు
11:50 AM, Jan 25, 2024
విశాఖ పశ్చిమ టీడీపీలో అసంతృప్తులు
- ఎమ్మెల్యే గణబాబు పై సొంత పార్టీ నేతల తిరుగుబాటు
- ఎమ్మెల్యే గణబాబుతో పనిచేయలేమంటూ తీర్మానం
- కార్యకర్తలను పట్టించుకోవడం లేదన్న నేతలు
- జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ప్రసాద్ అసంతృప్తి
- గణబాబు నాయకత్వంలో పనిచేయమన్న నేతలు
11:27 AM, Jan 25, 2024
రాజ్యసభ ఎన్నికలపై మాకొక వ్యూహాం ఉంది: ఎంపీ అయోధ్య రామిరెడ్డి
- గంటా రాజీనామా ఆమోదం స్పీకర్ ఇష్టం
- ఎప్పుడు కరెక్ట్ అనుకుంటే అప్పుడే ఆమోదిస్తారు
- రాజ్యసభ ఎన్నికల పై మా వ్యూహం మాకుంది
- మాకు ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారో టీడీపీ వాళ్లకు అన్నీ తెలుసు
- షర్మిల రాజకీయ భవిష్యత్తు కోసమే వచ్చారు
- సమస్యలు ఉంటే విడిగా డీల్ చేసుకోవాలి
- ప్రజలకు చెప్పినవన్నీ చేశాం
- ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి కామెంట్స్
10:58 AM, Jan 25, 2024
31న ఏపీ కేబినెట్ భేటీ
- భేటీ కానున్న ఆంధ్రప్రదేశ్ కేబినెట్
- ఈ నెల 31వ తేదీన సమావేశం
- సీఎం జగన్ అధ్యక్షతన భేటీ అయ్యి పలు కీలకాంశాల్ని చర్చించనున్న మంత్రివర్గం
10:52 AM, Jan 25, 2024
రాజమండ్రి: మండపేట టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి
- వేగుళ్లకు టికెట్ ఇవ్వడం పై లీడర్లు, కేడర్ ఆగ్రహం
- వేగుళ్లకు టికెట్ ఇవ్వొద్దంటున్న అసంతృప్తి నేతలు
10:49 AM, Jan 25, 2024
వాళ్ల హామీలను జనం నమ్మరు : వైవీ సుబ్బారెడ్డి
- ఉత్తరాంధ్ర అంటే సీఎం జగన్ కు ప్రత్యేక అభిమానం
- గత ఎన్నికల్లో ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావం పూరించారు
- మళ్లీ ఉత్తరాంధ్ర నుంచే ఎన్నికల శంఖారావం ప్రారంభిస్తున్నారు
- 27 సభ ద్వారా పార్టీ కేడర్కు సీఎం జగన్ దిశ నిర్దేశం చేస్తారు
- టీడీపీ జనసేన మేనిఫెస్టోను ప్రజలు విశ్వసించరు
- వెబ్ సైట్ నుంచి చంద్రబాబు మేనిఫెస్టో తొలగించారు
- 2014 ఎన్నికల్లో చంద్రబాబు పవన్ కలిసే ప్రచారం చేశారు
- ఎందుకు చంద్రబాబు తన పాలనలో అభివృద్ధి చేయలేక పోయారు
- వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తోంది
- మేలు జరిగితే నే ఓటు వేయండని దైర్యంగా చెప్పే నాయకుడు దేశంలో ఎవరు లేరు
- ఎన్ని పార్టీలు కలిసిన జగన్ విజయాన్ని అడ్డుకోలేరు
10:47 AM, Jan 25, 2024
బోండా ఉమకు ఆ అర్హత లేదు: వెల్లంపల్లి
- విజయవాడ సెంట్రల్ వైఎస్సార్సీపీ ఇంఛార్జి వెలంపల్లి శ్రీనివాసరావు కామెంట్స్.
- 58 డివిజన్లో సుమారు 40 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది
- బోండా ఉమా, చంద్రబాబు అభివృద్ధి చేసుంటే మాకు ఈ అభివృద్ధికి అవకాశం ఉండేదా?
- బోండా ఉమ, చంద్రబాబుకు ప్రజలను ఓట్లు అడిగే అర్హత లేదు
- బోండా ఉమా ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించాడు
- వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుంది కాబట్టే అపూర్వ స్వాగతం లభిస్తోంది
- సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే సీటు 25వేల మెజార్టీతో గెలుస్తున్నాం
10:45 AM, Jan 25, 2024
కొనసాగుతున్న వైఎస్సార్సీపీ సమావేశాలు
- అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో.. వైఎస్సార్సీపీ కీలక సమావేశాలు
- కాసేపట్లో వెంటకగిరి నియోజకవర్గం కార్యకర్తలతో సమావేశం
- తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో భేటీ కానున్న సీనియర్ నేత విజయసాయిరెడ్డి
- కలిసి పని చేయడంపై కేడర్కు దిశానిర్దేశం చేయనున్న విజయసాయిరెడ్డి
10:29 AM, Jan 25, 2024
కృష్ణపట్నం పోర్టు ఎక్కడికీ పోదు: మంత్రి కాకాణి
- కృష్ణపట్నం పోర్టుపై ఎవరూ.. ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు
- కంటైనర్ టెర్మిన్ను తరలించే ఉద్దేశం లేదు
- ఎవరినీ ఉద్యోగాల నుంచి తొలగించలేదు
- పోర్టు ఎక్కడికీ వెళ్లదు
- రాజకీయ లబ్ధి కోసమే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి తప్పుడు ఆరోపణలు
- రాజకీయంగా ఎదుర్కొలేక కేపీ పోర్ట్ తరలి పోతోందని టీడీపీ ప్రచారం
- కేపీ పోర్ట్ ఫిషింగ్ హార్బర్ ప్రస్తుతం అభివృద్ధి జరుగుతోంది
- పోర్ట్ ఇటీవల ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది.
- కేపీ పోర్ట్ అభివృద్ధి పెరుగుతోంది.. కొత్త వ్యాపారంతో ఏపీకి ఆదాయం వస్తోంది
- అభివృద్ధి లో ఉన్న పోర్ట్ ను దెబ్బ తీయాలనే సోమిరెడ్డి ప్రచారం
- గతం లో పవర్ పొల్యూషన్ పై కమ్యూనిస్ట్ లతో కలిసి ఆందోళన చేసిన సోమిరెడ్డి యాజమాన్యాలతో కుమ్ముక్కయ్యారు
- పోర్ట్ వ్యాపారం లో హెచ్చుతగ్గులు ఉంటాయి... గానీ పోర్ట్ పురోగతికి ఎలాంటి డోకా లేదు.
- కేపీ పోర్ట్ లో ఎలాంటి సర్వీస్ లు రద్దు కాలేదు. ఎక్కడికి తరలిపోలేదు
- పోర్ట్ లో కంటైనర్ తరలిస్తామన్నా... స్థానిక ఉద్యోగుల కు ఇబ్బంది కలిగినా.. అధికార పార్టీ ఎమ్మెల్యే గా నేనే ఆందోళన చేస్తా
- కేపీ పోర్టులో ఏ సర్వీస్ తొలగించినా నేరుగా ఆందోళన చేస్తా
- కృష్ణపట్నం పోర్టుపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించిన వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్
9:40 AM, Jan 25, 2024
పచ్చ బ్యాచ్కు సూటి ప్రశ్న.. సమాధానముందా?
- ప్రభుత్వ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియంపై నోరు జారిన పచ్చ బ్యాచ్
- ఈ ప్రశ్నలకు సమాధానమిచ్చే దమ్ముందా?.
గవర్నమెంట్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంపై నోరుజారిన పచ్చ గ్యాంగ్ కి స్ట్రయిట్ క్వశ్చన్….
— YSR Congress Party (@YSRCParty) January 25, 2024
ఈ ప్రశ్నకి సమాధానం చెప్పే దమ్ముందా @ncbn @PawanKalyan…?#YSJaganForQualityEducation pic.twitter.com/7NFGWy7SyS
8:15 AM, Jan 25, 2024
‘పొత్తు’ కడుపులో కత్తులు!
- బాబుకు 68 సీట్ల జాబితాతో పవన్ ప్రతిపాదన
- పార్టీ నేతలు, కొన్ని కుల సంఘాల ఒత్తిడితో పలు డిమాండ్లు
- 45కు తక్కువ కాకుండా కేటాయించాలని వినతి
- టీడీపీ బలంగా ఉన్న సీట్లు జనసేనకు ఇచ్చారన్న అభిప్రాయం కలిగించాలని సూచన
- అందుకే గత ఎన్నికల్లో గెలిచిన 23లో రెండైనా ఇవ్వాలని అభ్యర్థన
- జనసేన జాబితా బయటకు పొక్కడంతో క్షేత్రస్థాయిలో పెరిగిన విభేదాలు
- కత్తులు నూరుతున్న ఇరుపార్టీల నాయకులు.. సీట్ల పంపకాలపై రెండు పార్టీల్లోనూ ప్రతిష్టంభన
7:50 AM, Jan 25, 2024
చంద్రబాబుకు కొత్త టెన్షన్..!
- ‘రా కదలిరా’ సభలు కొన్ని రద్దు.. మరికొన్ని వాయిదా
- ఇప్పటి వరకు కష్టమ్మీద కొన్ని చోట్ల మాత్రమే సభలు
- ఆశించిన స్థాయిలో విజయవంతం కాక సతమతం.. జనాన్ని తరలించలేక చేతులెత్తేస్తున్న తమ్ముళ్లు
- మిగిలిన చోట్ల నిర్వహించడం ఇక కష్టమని నిర్ధారణ.. ఉరవకొండ, పీలేరులో బుధవారం జరగాల్సిన సభలు వాయిదా
- గోపాలపురం సభకు బదులుగా రాజమండ్రితో సరిపెట్టే యోచన.. పార్టీ పరిస్థితి అధ్వానంగా మారడంతో బయటకు రాని నేతలు
- సీట్ల సర్దుబాటు తేలక జనసేన నుంచి అందని సహకారం
7:20 AM, Jan 25, 2024
ప్రజాధనాన్ని దోచుకున్న వ్యక్తి చంద్రబాబు: వైఎస్సార్సీపీ
- టీడీపీ హయాంలో వెలిగొండను ఏటీఎంగా మార్చుకున్న చంద్రబాబు
- 2014-2019 చేసిన పనులు శూన్యం
- ఏ మాత్రం పనులు చేయకుండా రూ.650 కోటఉల కాంట్రాక్టర్లకు దోచిపెట్టి కమీషన్లు.
.@ncbn తన హయాంలో వెలిగొండ ప్రాజెక్టును ఏటీఎంగా మార్చుకొని ప్రజాధనాన్ని దోచుకున్నారు.
— YSR Congress Party (@YSRCParty) January 24, 2024
2014 నుంచి 2019 వరకూ ఏమాత్రం పనులు చేయకుండా రూ.650 కోట్లు కాంట్రాక్టర్లకు దోచిపెట్టి కమీషన్లు దండుకున్నారు. #CorruptBabuNaidu#EndOfTDP pic.twitter.com/LDFFV7oXZU
7:00 AM, Jan 25, 2024
ఉత్తరాంధ్రలో అభివృద్ధి షర్మిలకు కనిపించడం లేదా?: వైవీ సుబ్బారెడ్డి
- షర్మిలకు మేము చేసిన అభివృద్ధి చూపించడానికి సిద్ధం
- ఉద్ధానంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించింది ఎవరు?
- చంద్రబాబు చూపించారా.. కాంగ్రెస్ పార్టీ చూపించిందా..?
- ఏళ్ల తరబడి ఉద్దానంలో ఉన్న సమస్యకు సీఎం జగన్ పరిష్కారం చూపించారు
- చంద్రబాబు జనసేన మేనిఫెస్టోను ప్రజలు ఎవరూ నమ్మరు
- మేనిఫెస్టోను వెబ్సైట్ నుంచి తొలగించిన ఘనుడు చంద్రబాబు
- చంద్రబాబు ఎన్ని హామీలు అమలు చేశారో ప్రజలందరికీ తెలుసు
- రాజీనామా చేసే ముందు గంటా ఆలోచించుకోవాలి
- రాజీనామా చేసిన తర్వాత ఎప్పుడు ఆమోదిస్తే గంటాకు ఎందుకు?
- స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసి ఇప్పుడు గంటా గగ్గోలు పెడితే ఎలా?
- రాజధానిపై గ్రాఫిక్స్ చూపించిన చంద్రబాబు గురించి ఎందుకు షర్మిల మాట్లాడటం లేదు?
- విశాఖ రాజధాని కాకుండా కోర్టులో కేసులు వేసింది చంద్రబాబే
- అధికారంలో ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసింది చంద్రబాబు కాదా?
6:45 AM, Jan 25, 2024
తిరిగి మేం అధికారంలోకి రావడం ఖాయం: సీఎం జగన్
- నా వల్ల మేలు జరిగిందని భావిస్తేనే ఓటు వేయమని ధైర్యంగా అడుగుతున్నా
- తప్పనిసరిగా మేం తిరిగి అధికారంలోకి వస్తాం
- విద్య, వైద్యం, పరిపాలనా రంగాల్లో పెను మార్పులు తీసుకు వచ్చాం
- వివక్ష లేకుండా, అవినీతి లేకుండా పారదర్శకంగా అర్హత ఉన్న వారికి అన్నీ అందించాం
- మేని ఫెస్టోలో 99.5 శాతం హామీలను నెరవేర్చాం
- మా ప్రభుత్వానికున్న విశ్వసనీయతకు నిదర్శనం ఇది:
- కాంగ్రెస్ ఎప్పుడూ కూడా డర్టీ గేమ్ ఆడుతుంది
- విభజించి రాష్ట్రాన్ని పాలించాలనుకున్నారు
- రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారు
- అలాగే మా కుటుంబాన్ని కూడా విభజించారు
6:30 AM, Jan 25, 2024
ఇది మా ప్రభుత్వానికున్న విశ్వసనీయత: సీఎం జగన్
- ప్రతి 2వేల జనాభాకు గ్రామ సచివాలయాన్ని, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చాం
- వివక్ష లేకుండా, అవినీతి లేకుండా అర్హత ఉన్నవారికి డీబీటీ ద్వారా పథకాలు అందించాం
- డీబీటీ అన్నది ఒక విజయవంతమైన అంశం
- అయితే విద్య, వైద్యం, మహిళా సాధికారితల్లో గణనీయమైన మార్పులు తీసుకు వచ్చాం
- అన్నిటికంటే మించి వివక్ష లేకుండా పారదర్శకతతో ప్రత్యక్ష నగదు బదిలీ అమలు చేశాం
- కచ్చితంగా మేం తిరిగి అధికారంలోకి వస్తాం
- ప్రతిపక్షాలు ఏవీ కూడా పథకాలు గురించి మాట్లాడవు,
- వాటి అమలు గురించీ కూడా విపక్షాలు మాట్లాడలేవు
- ఇదే బడ్జెట్ గతంలోనూ ఉంది..ఇప్పుడూ ఉంది
- కాని మార్పు ఏంటంటే.. కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మారారు
- కాని ఈ ప్రభుత్వం మాత్రమే ఇవన్నీ చేయగలిగింది
- చంద్రబాబు విషయంలో ప్రతీకారం అన్నది నాకు లేనే లేదు
- చంద్రబాబుపై అవినీతి ఆరోపణల విషయం కోర్టుకు చేరింది
- ఆ ఆరోపణలు, ఆధారాలను చూసి కోర్టు నిర్ణయం తీసుకుని రిమాండ్ విధించింది
- అలాంటప్పుడు ప్రతీకారం ఎలా అవుతుంది.?
- సీఐడీ కేసులు పెట్టినా, కోర్టులు ఆధారాలను చూస్తాయి కదా?
- వాటిని చూసి కన్విన్స్ అయితేనే కోర్టులు నిర్ణయాలు తీసుకుంటాయి
- రాష్ట్రంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల ఉనికి పెద్దగా లేదు
- పోటీ మా పార్టీకి, టీడీపీ- జనసేన కూటమికి మధ్యే ఉంటుంది
- ప్రతి పార్టీ కూడా సర్వేలు చేస్తుంది
- వాటి ఫలితాల ఆధారంగా మార్పులు, చేర్పులు చేస్తుంది
- ప్రభుత్వం పట్ల ప్రజలు చాలా సానుకూలంగా ఉన్నారు
- కాని కొందరు స్థానిక నాయకుల విషయంలో ప్రజలకు కొంత అసంతృప్తి ఉంది
- అంతేకాకుండా సామాజిక సమీకరణాల దృష్ట్యా కూడా కొన్ని మార్పులు చేశాం
- చివరిదశలో మార్పులు చేసి అయోమయం సృష్టించే కన్నా, ముందుగానే నిర్ణయిస్తున్నాం
- జాతీయ రాజకీయాలు విషయంలో మా విధానం స్పష్టం:
- రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మేం రాజీపడబోం
- ప్రజల ప్రయోజనాల విషయంలోనే కేంద్ర ప్రభుత్వం సహకారంతో ముందుకు వెళ్తున్నాం:
- కాంగ్రెస్ ఎప్పుడూ కూడా డర్టీ గేమ్ ఆడుతూ ఉంటుంది
- అది ఆ పార్టీ సంప్రదాయంగా గమనిస్తున్నాం
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారు
- విభజించి రాష్ట్రాన్ని కాంగ్రెస్ పాలించాలనుకుంది
- అలాగే మా కుటుంబాన్ని కూడా విభజించారు
- నేను కాంగ్రెస్నుంచి విడిపోయినప్పుడు గతంలో మా చిన్నాన్నకు మంత్రిపదవి ఇచ్చి మాపై పోటీకి పెట్టారు
- వారు పాఠాలు నేర్వలేదు
- కాంగ్రెస్ పార్టీ ఏపీ సారథ్య బాధ్యతలు మా సోదరికి ఇచ్చారు
- కాని అధికారం అనేది దేవుడు ఇచ్చేది
- దేవుడ్ని నేను బలంగా నమ్మతాను ఆయనే అన్నీ చూస్తాడు.
6:30 AM, Jan 25, 2024
టీడీపీ హయాంలో పథకాలు కొందరికే దక్కేవి: సజ్జల రామకృష్ణారెడ్డి
- వైఎస్సార్ ఆశయాలు.. ఆలోచనలకు అనుగుణంగా పెట్టిన పార్టీ వైఎస్సార్సీపీ
- అణగారిన వర్గాలతో అసోసియేట్ అవ్వడమే ప్రధాన లక్ష్యం
- సీఎం జగన్.. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి తన చిత్తశుద్ధి నిరూపించుకున్నారు
- పథకాలు, సంస్కరణల్లో సీఎం జగన్ బడుగు బలహీన వర్గాలకు పెద్ద పీట వేశారు
- అణగారిన వర్గాలనుపైకి తీసుకువచ్చే ప్రక్రియలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల భాగస్వామ్యం కావాలి
- గత ప్రభుత్వాలు వెనుకబడిన తరగతుల కోసం ఖర్చు చేసిందేమీ లేదు
- సంపన్నులతో పోటీ పడే స్థాయికి అన్ని వర్గాలనూ తీర్చిదిద్దిన ఘనత సీఎం జగన్కే దక్కింది
- సచివాలయ ఉద్యోగాల్లో 80 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలకే దక్కాయి
- మేనిఫెస్టోలో లేనివి కూడా సీఎం జగన్ అమలు చేశారు
- టీడీపీ హయాంలో పథకాలు కొందరికే దక్కేవి. సీఎం జగన్ అర్హులైన వారిని వెతికి మరీ ఇచ్చారు
- ఈ నాలుగున్నరేళ్లలో జరిగినంత సంక్షేమం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జరగలేదు
- ఎన్నికలు రాబోతున్నాయ్. మీ భవిష్యత్తులు మారాలంటే.. మీరంతా ప్రభుత్వం చేస్తున్న మేలును ప్రజల్లోకి తీసుకెళ్లాలి
- ఏ చిన్న తేడా జరిగినా పేదలకు జరుగుతున్న మంచి దూరమైపోతుంది
- మీడియాను మేనేజ్ చేస్తే సరిపోతుందని కొన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి
- ఏమీ జరగడం లేదని ప్రచారం చేస్తున్నారు.
- ప్రభుత్వం చేస్తున్న మంచికి.. అభివృద్ధికి పబ్లిసిటీ అవసరం లేదని సీఎం భావించారు
- కొత్తగా రూపుదిద్దుకుంటున్న పోర్టులు రాష్ట్రం రూపురేఖలు మార్చేస్తాయి
- 11 మెడికల్ కళాశాలల ద్వారా దేశానికి కావాల్సిన వైద్యులను ఏపీ అందించబోతోంది
- అంబేద్కర్కు హిమాలయాలంత విగ్రహం పెట్టినా సరిపోదు
- అంతర్జాతీయ స్థాయిలో అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం రూపుదిద్దుకుంది
- అంబేద్కర్ విగ్రహం గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుకుంటుంది
- అమెరికాలో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కనిపిస్తుంది. విజయవాడలో కొండ పై అమ్మవారు.. కొండ కింద అంబేద్కర్ కనిపిస్తారు
- దళితుల నుంచి మరింత మేధావులు రావాలనేదే సీఎం జగన్ ఆలోచన
- ఆయన చేపట్టిన యజ్ఞంలో మీరంతా భాగస్వామ్యం కావాలని కోరుతున్నా