సాక్షి, అమరావతి: ఓటమిని చంద్రబాబు ఏడాదిన్నర ముందే అంగీకరించారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గురువారం ఆయన ‘సాక్షి’ మీడియాతో మాట్లాడుతూ, ‘‘గత ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుకు బైబై అన్నారు.. వచ్చే ఎన్నికల్లో గుడ్ బై బాబు అంటారు’’ అంటూ ఎద్దేవా చేశారు.
‘‘వచ్చే ఎన్నికల్లో కుప్పం సహా 175 సీట్లలో గెలుస్తాం. చంద్రబాబుకు 40 ఏళ్ల అనుభవం చివరికి పిచ్చి పిచ్చిగా మాట్లాడటానికే ఉపయోగపడింది. ఆయన మానసికంగా ఫిట్గా లేరు. అది ఆయన మాటలు, చేష్టల ద్వారానే తెలుస్తూనే ఉంది. ఆయన తన భార్య గురించి పదేపదే ప్రస్తావించుకోవటం కరెక్టు కాదు. దాని వలన సానుభూతి పొందాలనుకోవటం చంద్రబాబు అవివేకం. వైఎస్ జగన్లో ఆత్మ విశ్వాసం కన్పిస్తుంటే.. చంద్రబాబులో నైరాశ్యం కనిపిస్తోందని’’ మంత్రి అంబటి అన్నారు. చదవండి:పేదల ఇళ్లపై ఇవీ నిజాలు.. బాబూ పవనూ అర్థమవుతుందా?