AP Elections Political Latest Updates Telugu..
9:30 PM, Feb 2nd, 2024
మీ బతుకుల నిండా అబద్ధాలు.. తప్పుడు ప్రచారాలే
- ఈసారి కూడా ప్రజలు దిమ్మతిరిగే తీర్పుతో టీడీపీకి శాశ్వతంగా సమాధి కట్టబోతున్నారు
- రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జీతాలు, అలవెన్సులు రూపంలో సలహాదారులకు, వారి సిబ్బందికి, ఇంటి అద్దెరూపంలో, కారు సౌకర్యం రూపంలో మొత్తంగా చెల్లించింది కేవలం రూ.48.33 కోట్లు
- ప్రజావ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి, ఆయన సిబ్బందికి, కారు, ఇంటి అద్దె అలవెన్స్ రూపంలో చెల్లించింది కేవలం రూ.165 లక్షలు.
- మరి ఈ రూ.140 కోట్లు లెక్క ఎక్కడిది?
- రోజురోజుకి పచ్చి అబద్ధాలు చెప్తూ సిగ్గూ, శరంలేకుండా ప్రవర్తిస్తుంది టీడీపీ
మీ బతుకుల నిండా అబద్ధాలు. తప్పుడు ప్రచారాలే. ఈసారికూడా ప్రజలు దిమ్మతిరిగే తీర్పుతో మీ పార్టీకి శాశ్వతంగా సమాధికట్టబోతున్నారు @JaiTDP. రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జీతాలు, అలవెన్సులు రూపంలో సలహాదారులకు, వారి సిబ్బందికి, ఇంటి అద్దెరూపంలో, కారు సౌకర్యం రూపంలో మొత్తంగా… https://t.co/APeG3dtIQM
— YSR Congress Party (@YSRCParty) February 2, 2024
9:23 PM, Feb 2nd, 2024
టీడీపీ వాళ్లకే జనసేన టికెట్లు
- జనసేన ముసుగులో పోటీ చేయబోయేది తెలుగుదేశం నేతలే
- పవన్ కళ్యాణ్కు తెలియడం లేదు.. బాబు ఇప్పటికే వెన్నుపోటు పొడిచాడని..
- కాకినాడ ఎంపీ అభ్యర్థే అందుకు ఉదాహరణ
- సాన సతీష్ లోకేష్కు అత్యంత సన్నిహితుడు
- జన సైనికుల్లో ఆందోళన
- ఇదీ చంద్రబాబు మార్కు రాజకీయం అంటున్న పలువురు రాజకీయ విశ్లేషకులు
8:58 PM, Feb 2nd, 2024
రీజనల్ ఇన్ఛార్జ్లుగా వైవీ సుబ్బారెడ్డి, మజ్జి శ్రీనివాస్ నియామకం
- అనకాపల్లి, విశాఖపట్నం, అరకు, విజయనగరం, శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గాలకు రీజనల్ ఇన్ఛార్జీగా వైవీ సుబ్బారెడ్డి
- అరకు పార్లమెంటు నియోజకవర్గంలోని సాలూరు, పార్వతీపురం, కురుపాం, పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గాలకు, దీంతో పాటు విజయనగరం, శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గాలకు మజ్జి శ్రీనివాసరావు డిప్యూటీ రీజినల్ కో- ఆర్డినేటర్గా నియామకం
- ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం
8:52 PM, Feb 2nd, 2024
వైఎస్సార్సీపీ ఆరో జాబితా విడుదల
- నాలుగు పార్లమెంట్, ఆరు అసెంబ్లీ స్థానాలకు నియోజకవర్గాల ఇన్ఛార్జ్ల ప్రకటన
6:44 PM, Feb 2nd, 2024
ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ నేతల టెన్షన్ టెన్షన్
- వైఎస్సార్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల కోసం చూస్తోన్న టీడీపీ
- పార్ధసారథి, వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరిక ఖాయమంటున్న పార్టీ నేతలు
- తిరువూరు నియోజకవర్గంలో తెరపైకి కొలికలపూడి శ్రీనివాసరావు
- ఆందోళనలో ప్రస్తుత తిరువూరు ఇంచార్జ్ శావల దేవదత్
- పార్ధసారథిని నూజివీడుకి ఒప్పించేందుకు టీడీపీ హైకమాండ్ నానా హైరానా
- మైలవరం, పెనమలూరు టీడీపీ నేతల్లో ఉత్కంఠ
- దేవినేని ఉమా వర్సెస్ వసంత కృష్ణ ప్రసాద్
- ఒకరికి పెనమలూరు, మరొకరికి మైలవరం కేటాయించేందుకు ప్రయత్నాలు
- ఇప్పటికే ఈ రెండు నియోజకవర్గాల్లో వివిధ ఏజెన్సీల ద్వారా హైకమాండ్ సర్వేలు
- విజయవాడ పశ్చిమ టీడీపీ లో గందరగోళం
- బుద్ధ వెంకన్న, జలీల్ ఖాన్ పోటాపోటీ బల ప్రదర్శనలు
- పొత్తులో భాగంగా జనసేన కు ఇచ్చే సీట్లపై రాని క్లారిటీ
- విజయవాడ పశ్చిమ, అవనిగడ్డలు జనసేనకు అంటూ ప్రచారం
- నూజివీడులో ప్రస్తుతం ఇంచార్జ్ గా ఉన్న ముద్రబోయిన వెంకటేశ్వరరావు
- తనని విస్మరిస్తే ఇండిపెండెంట్గా బరిలో దిగుతానంటూ ముద్రబోయిన హెచ్చరికలు
6:39 PM, Feb 2nd, 2024
జీవితాంతం సీఎం జగన్తోనే ఉంటా: కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్
- తాను పార్టీ మారుతానంటూ ఎల్లో మీడియా తప్పుడు రాతలు
- నేను సీఎం జగన్ని కాదని ఎక్కడకూ వెళ్లను
- సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నాకు రెండుసార్లు సీఎం జగన్ బీఫామ్ ఇచ్చారు
- సీఎంకి జీవితాంతం రుణపడి ఉంటా
- టీటీడీలో సభ్యులుగా సీఎం అవకాశం కల్పించారు
- నాకు ఇద్దరు దేవుళ్లు.. ఒకరు సీఎం జగన్, ఇంకొకరు వెంకటేశ్వరస్వామి
- నా రాజకీయ దేవుడు వైఎస్ జగన్ ఏం చెబితే అది చేస్తా
- కనిగిరిలో కొత్త ఇన్ఛార్జ్కి పూర్తిగా సహకరిస్తాం
- సీఎం జగన్ ఎవరికి చెబితే వారికి పని చేస్తాం
- నాపై ప్రేమతో కొందరు రాజీనామాలు అంటూ హడావుడి చేశారు
- కానీ అదేం లేదు.. అందరం కలిసి పనిచేస్తాం
- కనిగిరి కొండమీద వైఎస్సార్సీపీ జెండా ఎగురవేస్తాం
- సీటిస్తే ఒకలాగ, ఇవ్వకపోతే ఇంకోలా ఉండను
- సీఎం జగన్తో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది
- దాన్ని ఎవరూ మార్చలేరు
6:05 PM, Feb 2nd, 2024
భీమవరంలో పోటీ చేసే దమ్ముందా?
- పవన్కల్యాణ్, చంద్రబాబుకు విప్ గ్రంథి శ్రీనివాస్ సవాల్
- దమ్ముంటే ఇద్దరు భీమవరం నుంచే తనపై పోటీ చేయాలని పిలుపు
- ఓడిపోతానన్న భయంతోనే టీడీపీతో పవన్ పొత్తు
- సిద్ధాంతంలేని రాజకీయ ఉసరవెల్లి పురందేశ్వరి
- బీజేపీలో ఉండి టీడీపీ కోసం పనిచేస్తున్నారు
- ఆమె మాటలు విని రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారు.
4:52 PM, Feb 2nd, 2024
టీడీపీ-జనసేనల మధ్య మనస్పర్థలు
- నియోజకవర్గాలపై ఇంకా రాని స్పష్టత
- పాదయాత్రల పేరిట రెండు పార్టీల నాయకుల బలప్రదర్శన
- జనసేన బలంగా ఉన్న చోట టిడిపి నేతల పాదయాత్రలు
- పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలంలో జనసేన మహా పాదయాత్ర
- సత్తెనపల్లి జనసేన సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు పాదయాత్ర
- గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో జనంతో జనసేన యాత్ర
- బలం చూపించుకోవాలని పోటాపోటీగా తాపత్రయపడుతోన్న క్యాడర్
- పొత్తుల తక్కెడలో తేలని లెక్కలతో చొక్కాలు చించుకుంటోన్న పవన్, బాబు
4:48 PM, Feb 2nd, 2024
ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలి.. లోక్సభలో వైఎస్సార్సీపీ ఎంపీ సత్యవతి
- విభజన చట్టంలోని హామీలన్నీ నెరవేర్చాలి
- నీతి ఆయోగ్ సిఫారసుల మేరకు ఏపీలో జాతీయ ఆహార భద్రత రేషన్ కార్డుల కవరేజ్ పెంచాలి
- తుపాన్లతో ఏపీ తరచూ తీవ్రంగా నష్టపోతోంది
- తుపానుల నుంచి ఏపీని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం శాశ్వత నిధిని ఏర్పాటు చేయాలి
- విద్యారంగంలో, సులభతర వాణిజ్యం, మత్స్య రంగంలో ఏపీ నంబర్వన్గా ఉంది
3:49 PM, Feb 2nd, 2024
ప్రతిపక్షాల కుట్రలు తిప్పికొడతాం: ఎమ్మెల్యే అనిల్
- ఏలూరులో జరగబోయే సిద్దం సభకు పామర్రు నియోజకవర్గం నుంచి అపూర్వ స్పందన రాబోతోంది
- ఎన్నికలకు జగన్ మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు
- ఈ రాష్ట్రానికి మళ్లీ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నారు
- ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం జగన్ మోహన్ రెడ్డి సీఎంగా కొనసాగాలి
- మేం ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం
- టీడీపీ, జనసేన మిగిలిన అన్ని రాజకీయ పార్టీల కుట్రలను తిప్పికొడతాం
- జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ శ్రేణులు ఏలూరు సభలో శంఖారావం పూరించబోతున్నాం
పామర్రు ఎమ్మెల్యే అనిల్ కుమార్ వ్యాఖ్యలు
3:23 PM, Feb 2nd, 2024
ఆరో జాబితాపై వైఎస్సార్సీపీ ఫోకస్
- పలువురు ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్న సీఎం జగన్
- సీఎంవోకు వచ్చిన కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూధన్, సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్బాబు, నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్
- ఇటీవలె నరసరావుపేట ఎంపీ స్థానానికి సమన్వయకర్తగా అనిల్కు ప్రమోషన్
3:17 PM, Feb 2nd, 2024
వార్ వన్ సైడే: బైరెడ్డి సిద్దార్థ రెడ్డి
- టీడీపీ నేతలు బ్రోకర్ రాజకీయాలు మానుకోవాలి
- ఎన్నికల ముందే చంద్రబాబుకు ప్రజలు గుర్తుకు వస్తారు
- బాబు వస్తే జాబ్ గ్యారెంటీ అని.. చంద్రబాబు 9ఏళ్ల పాలనలో ఏమి చేశాడో చెప్పాలి
- 2019 ఎన్నికలు ఒకలెక్క 2024 ఒకలెక్క వార్ వన్ సైడ్ గా ఉంటుంది
- ఎన్నికలకు అందరూ సిద్ధం కావాలి
- మా టార్గెట్ 175/175 గెలిచి సీఎం జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇస్తాం
- గ్రామాల్లో ఎక్కడ చూసినా జగనన్న సంక్షేమ పథకాలే కనిపిస్తున్నాయి,
- చంద్రబాబుకు కుళ్లు కుతంత్రాలు చేసే రాజకీయాలు తప్ప ఏమీ తెలియదు,
- చంద్రబాబు పాలన మొత్తం అవినీతి పాలన
- ఒంటరిగా పోటీ చేసే సత్తా చంద్రబాబుకు ఉందా?
- ప్రతి గడప గడపకు వెళ్ళి చంద్రబాబు తీరుని ఎండగడతాం
నందికొట్కూరులో శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి వ్యాఖ్యలు
2:49 PM, Feb 2nd, 2024
పవన్ వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదు?: కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు
- గజ దొంగల ముఠా నుంచి ప్రజలను కాపాడేందుకు దీటుగా సీఎం జగన్ కార్యకర్తలను సిద్ధం చేయనున్నారు
- చంద్రబాబు విజన్ ఏంటో 14 ఏళ్లగా ప్రజలు గమనిస్తున్నారు
- బూటకపు స్కీముల ద్వారా చంద్రబాబు తన సామాజిక వర్గాన్ని జన్మభూమి కమిటీలకు తప్ప ప్రజలను ఆదుకున్న దాఖలాలు లేవు
- సీఎం జగన్ తెచ్చిన సంక్షేమ పథకాల పేర్లు కూడా చెప్పేందుకు అరగంట సమయం పడుతుంది
- ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని సంస్కరణలు, ఇంత అభివృద్ధి జరగలేదు
- విద్య, వైద్యం ఫ్రీగా అందిస్తున్న నాయకుడు దేశంలోనే సీఎం జగన్ ఒక్కరే
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని 175కు 175 గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రతి కార్యకర్త రానున్నారు
- పవన్ కాపులకు ఏమి చేశాడు?
- 2014 నుంచి ఒక్క పదవి కూడా కాపు సోదరులకు ఇప్పించలేదు.. 2024లో ఏమి ఇప్పిస్తాడు
- 200కు పైగా కాపు నేతలకు పదవులు ఇచ్చిన నాయకుడు సీఎం జగన్
- కాపులను సీఎం జగన్ ఆర్థికంగా రాజకీయంగా ఆదుకున్నారు
- పవన్ కళ్యాణ్ వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదు...?
1:45 PM, Feb 2nd, 2024
మోసం చేసేందుకు బాబు డ్రామా కంపెనీ సిద్ధమైంది: వైవీ సుబ్బారెడ్డి.
- డ్వాక్రా అక్కచెల్లెమ్మలను చంద్రబాబు ఘోరంగా మోసం చేశారు
- రాష్ట్రంలో రాబోయే తరానికి ఉపయోగపడే విధంగా సీఎం జగన్ సంక్షేమ పథకాలు అందించారు.
- ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా ముఖ్యమంత్రి జగన్ పరిపాలన చేశారు
- 2014లో మోసం చేసినట్టే.. ఇప్పుడు కూడా మోసం చెయ్యడానికి మళ్లీ డ్రామా కంపెనీ సిద్ధమైంది.
- టీడీపీ, జనసేన మళ్లీ నాటకాలు మొదలుపెట్టారు.
1:30 PM, Feb 2nd, 2024
షర్మిల దీక్ష బాబు డ్రామాల్లో భాగమే: మంత్రి మేరుగు
- ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ఢిల్లీలో దీక్షపై మంత్రి మేరుగ నాగార్జున సీరియస్
- షర్మిల ఈ నాలుగున్నర సంత్సరకాలంగా ప్రత్యేక హోదా గురించి మార్చి పోయిందా?
- ఆమెకు ఇప్పుడే గుర్తొచ్చిందా?
- ఇప్పుడు ఎవరు చెప్తే ఢిల్లీ వెళ్ళింది
- ఎవరిని దూషించడానికి వెళ్ళిందో చెప్పాలి
- ఇవన్నీ చంద్రబాబు చేస్తున్న నాటకాలు, డ్రామాలలో భాగమే.
1:10 PM, Feb 2nd, 2024
చంద్రబాబుపై అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి ఫైర్
- చంద్రబాబు పచ్చి అబద్ధాలకోరు.
- ఎవరో రాసింది చదివి నాపై ఆరోపణలు చేస్తున్నారు.
- రాజమండ్రి సభలో నాపై, నా కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేసి ఆయన స్థాయిని దిగజార్చుకున్నాడు.
- చంద్రబాబు పేర్కొన్న గ్రావెల్ అవతలకు సంబంధించి ఎవరి ప్రభుత్వంలో అనుమతులు వచ్చాయో చూసుకోవాలి.
- అనుమతులకి సొమ్ము చెల్లించామని చెబుతున్న వ్యక్తులు సత్య ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూనే మూడేళ్లుగా ముందుకు రావడం లేదు.
- అబద్ధాలు, మోసం, కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య.
- అదే అనుభవంతో అనపర్తి టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి శిక్షణ ఇచ్చారు.
- దీంతో అనపర్తి నియోజకవర్గం 2014 నుండి 2019 వరకు అవినీతి కూపంలా మారింది.
- టీడీపీ ప్రభుత్వ హయాంలో కాల్ మనీ పేరుతో అనపర్తి ప్రాంత వడ్డీ వ్యాపారులను వేధింపులకు గురి చేశారు.
- అనపర్తి ప్రజలు ఎప్పటికీ ఇది మర్చిపోరు.
- 2019 తర్వాత అనపర్తి నియోజకవర్గంలో రాజకీయ అవినీతి లేదన్న విషయం నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు.
- ఎన్ని పిల్లి మొగ్గలేసినా, ఎంతమందితో పొత్తులు పెట్టుకువచ్చినా అంతిమంగా ప్రజలు గెలిపించేది సీఎం జగన్నే.
12:45 PM, Feb 2nd, 2024
షర్మిల కండువా కాంగ్రెస్ది.. స్క్రిప్ట్ చంద్రబాబుది: మంత్రి రోజా ఫైర్
- కుటుంబాలను చీల్చడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య
- షర్మిల మెడలో కండువా కాంగ్రెస్ పార్టీది.. ఆమె చదివే స్క్రిప్ట్ మాత్రం చంద్రబాబుది
- మూడుసార్లు సీఎంగా చేస్తే మేనిఫెస్టోలో పెట్టినవి అమలు చేశాను అని చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదు.
- మళ్లీ అవకాశం ఇవ్వండి అని సిగ్గులేకుండా అడుగుతున్నారు.
- నాడు ఎన్టీఆర్ కుటుంబంతో ప్రారంభమై నేడు వైఎస్సార్ కుటుంబం వరకు వచ్చాడు.
- ఇలాంటి అవకాశం ఇచ్చిన షర్మిలది తప్పు.
- వైఎస్సార్ కుటుంబం మాట ఇస్తే నిలబడతారు అనే నమ్మకం ప్రజల్లో ఉంది.
- వైఎస్సార్ ఆత్మ క్షోభించే విధంగా షర్మిల వ్యవహరిస్తున్నారు.
- ఎన్నికల్లో పోటీ చేసేందుకు చంద్రబాబుకు అభ్యర్థులు కూడా దొరకడం లేదు.
- వైఎస్సార్పార్టీ నుంచి తరిమేసిన నాయకులను అభ్యర్థులుగా పెట్టుకునే పరిస్థితికి దిగజాగారు.
- తెలంగాణ అని పార్టీ పెట్టి, అక్కడ కాంగ్రెస్, టీడీపీ, జనసేన గురించి ఏం చేశారో ప్రజలు గమనించారు.
- ఇప్పుడు ఆంధ్రాలో అబద్ధాలు మొదలు పెట్టారు.
- ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు’ అని అన్నారు.
- నగరి నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదు అంటున్న నాయకులు, ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం
- నగరి నియోజకవర్గంలో అభివృద్ధి వచ్చి చూస్తే కళ్ళకు కనిపిస్తుంది
12:30PM, Feb 2nd, 2024
పేదలకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తున్న ఘనత సీఎం జగన్దే: మంత్రి పెద్దిరెడ్డి
- సమన్వయకర్తల నియామకంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సామాజిక న్యాయం పాటిస్తున్నారు
- వైఎస్ కుటుంబాన్ని చీల్చిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు
- ప్యాకేజీ కోసం.. ప్రత్యేక హోదా తాకట్టు పెట్టింది చంద్రబాబు నాయుడే
- టీడీపీ, ఎల్లో మీడియా అసత్య ప్రచారం చేస్తున్నాయి
- విశాఖ రైల్వే జోన్కు జనవరిలోనే రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించింది
- స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే దుష్ప్రచారం చేస్తున్నారు
12:25PM, Feb 2nd, 2024
జగనన్న తలపెట్టిన సిద్ధం సభకు అందరూ సిద్ధంకండి: వెల్లంపల్లి
- సీఎం జగన్ తలపెట్టిన సిద్ధం కండి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి
- మూడు సంవత్సరాలు కాలంలో మనం చేసిన మంచి పనులు ప్రజలకు వివరించాలి
- విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుండి వేల ప్రజలు తరలి వెళ్తున్నాం
- సీఎం జగన్ సభకు మద్దతు ఇచ్చే విధంగా అన్ని ప్రాంతాల నుండి తరలి వెళ్తున్నాం
- సీఎం జగన్ పాలనలో శాంతినగర్ ప్రగతి కాలనీ ప్రశాంతి నగర్ రోడ్లు అద్భుతంగా ఉన్నాయి
- సీఎం జగన్ సంక్షేమ పథకాలకు ప్రజలందరూ ఆకర్షితులు అవుతున్నారు
- గతంలో ఎమ్మెల్యేలు ప్రజల వద్దకు వచ్చిన సందర్భాలు లేవు
- ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యేలు.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు మాత్రమే
12:21PM, Feb 2nd, 2024
పవన్.. కనీసం గ్లాస్ గుర్తునైనా పోటీలో పెట్టు: ద్వారంపూడి సవాల్
- రేపు ఏలూరులో జరిగే సభకు 75 బస్సులు..100 కార్లలో తరలివెళ్తున్నాం
- గడిచిన ఐదేళ్ళ కాలంలోసీఎం జగన్ అందించిన సంక్షేమ పాలనలో పేదరికం తొలగింది
- చంద్రబాబును ఎత్తడం కోసమే జనసేన మేము సిద్దం అంటుంది.
- నాపై పోటీ చేయమని పవన్ కళ్యాణ్కు సిద్ధం అని చెబుతున్నా
- కనీసం నామీద గ్లాస్ గుర్తునైన పోటీలో పెట్టమని సవాల్ చేస్తున్నా
11:10AM, Feb 2nd, 2024
సుప్రీంకోర్టులో రామోజీకి బిగ్షాక్
- మార్గదర్శి చిట్ఫండ్స్కు సంబంధించిన ఏపీలో కేసులను తెలంగాణకు బదిలీ చేయాలన్న మార్గదర్శి వాదనను తిరస్కరించిన సుప్రీంకోర్టు
- ఏపీలో నమోదైన కేసులను బదిలీ చేయడానికి తగిన కారణాలేవీ కనిపించడం లేదన్న సుప్రీంకోర్టు
- కేసు విచారణపై స్టే కావాలంటే ఏపీ హైకోర్టునే ఆశ్రయించండి
- ఏదైనా అవసరం అనుకుంటే ఏపీ హైకోర్టులోనే తగిన పిటిషన్లను వేసుకోండి
- కేసును కొట్టివేస్తే పిటిషన్లన్నీ నిరర్ధకమే కదా అని వ్యాఖ్యానించిన ధర్మాసనం
- ఏపీ ప్రభుత్వం వాదనలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం వాదనలు ఇలా..
- ఆంధ్రప్రదేశ్లోనే మార్గదర్శి చిట్ఫండ్స్ నేరాలకు పాల్పడింది.
- ఈ కేసులను తెలంగాణకు బదిలీ చేయడానికి కారణమే లేదు.
- ఏపీలో మార్గదర్శి చిట్ఫండ్స్ ఏటా రూ.3,274 కోట్ల రూపాయల టర్నోవర్ వ్యాపారం చేస్తోంది.
- ఏపీ సీఐడీ పోలీసులు ఈ కేసులను దర్యాప్తు చేస్తున్నారు.
- చిట్ఫండ్స్ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ పరిధిలోనే న్యాయ విచారణ జరగాలి.
- ఈ కేసుల్లో 150 మంది సాక్షుల స్వస్థలం ఆంధ్రప్రదేశ్. తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ పెండింగ్ ఉందన్న కారణంగా ఇక్కడ కేసుల బదిలీకి ఆధారం కాదు.
- ఏపీ హైకోర్టు న్యాయపరిధి అంశంపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోనని గతంలోని చెప్పింది.
- ఈ కేసులో విచారణకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తగిన న్యాయస్థానం. కేసులో దర్యాప్తు ఆంధ్రప్రదేశ్ సీఐడీ చేస్తోంది.
11:00AM, Feb 2nd, 2024
రాష్ట్రానికి సుపరిపాలన అందించిన నాయకుడు సీఎం జగన్: ఎమ్మెల్యే జక్కంపూడి రాజా
- గత ప్రభుత్వ హయాంలో రాస్తున్న పేదలకు ఒక అంగుళం స్థలం కూడా లభించలేదు
- సీఎంగా జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన పేదలందరికీ 31 లక్షల ఇళ్ల పట్టాలని అందజేసి వారి ఇళ్ళు నిర్మిస్తున్నారు
- రాష్ట్రంలో గృహ నిర్మాణం ఒక యజ్ఞంలా జరుగుతుంది
- ప్రజల సంక్షేమం కోసం సీఎం జగన్ అనేక చర్యలు చేపడుతున్నారు
- స్కిల్ డెవలప్మెంట్ పేరుతో యువతను మోసం చేసి కోట్లాది రూపాయలు కొట్టేసిన నాయకుడు చంద్రబాబు
- చంద్రబాబు ముఖ్యమంత్రిగా పని చేసిన 14 సంవత్సరాల కాలంలో ఒక్క మంచి పథకం కూడా లేదు
- జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ నాయకులు జనాన్ని దారుణంగా దోచుకున్నారు
- సైకిల్ను షెడ్డులో పెట్టడానికి జనం సిద్ధపడుతున్నారు
- జనసేనతో చంద్రబాబు అనైతిక పొత్తు ఏర్పాటు చేసుకుని ఎన్నికలకు వెళుతున్నారు ప్రజలు కచ్చితంగా వీరిని తిరస్కరిస్తారు
- సిఎం జగన్ను మరోసారి ప్రోత్సహించండి... రాష్ట్రానికి మరింత మేలు జరుగుతుంది
10:45AM, Feb 2nd, 2024
అది ఎల్లోమీడియా తప్పుడు ప్రచారం: ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్యాదవ్
- పార్టీ మారతానంటూ చేస్తున్న ప్రచారంలో నిజం లేదు
- నేను సీఎం జగన్ని కాదని ఎక్కడకూ వెళ్లను
- సామాన్య కుటుంబ నుంచి వచ్చిన నాకు రెండు సార్లు జగన్ బీఫామ్ ఇచ్చారు
- సీఎంకి జీవితాంతం రుణపడి ఉంటా
- టీటీడీలో సభ్యులుగా సీఎం అవకాశం కల్పించారు
- నాకు ఇద్దరు దేవుళ్లు, ఒకరు సీఎం జగన్, ఇంకొకరు వెంకటేశ్వరస్వామి
- నా రాజకీయ దేవుడు జగన్ ఏం చెబితే అది చేస్తా
- కనిగిరిలో కొత్త ఇన్ఛార్జికి పూర్తిగా సహకరిస్తాం
- జగన్ ఎవరికి చెబితే వారికి పని చేస్తాం
- నామీద ప్రేమతో కొందరు రాజీనామాలు అంటూ హడావుడి చేశారు
- కానీ అదేంలేదు. అందరం కలిసి పనిచేస్తాం
- కనిగిరి కొండమీద వైఎస్సార్సీపీ జెండా ఎగురవేస్తాం
- సీటిస్తే ఒకలాగ, ఇవ్వకపోతే ఇంకోలా ఉండను
- జగన్తో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది
- దాన్ని ఎవరూ మార్చలేరు
9:50 AM, Feb 2nd, 2024
విజయవాడ వెస్ట్ టీడీపీలో టిక్కెట్ రచ్చ
- చంద్రబాబుకు తలపోటుగా మారిన వెస్ట్ టిక్కెట్ పంచాయతీ
- తనకే టిక్కెట్ ఇవ్వాలంటూ ర్యాలీ చేసిన బుద్ధా వెంకన్న
- మైనార్టీ కోటాలో తనకే టిక్కెట్ ఇవ్వాలంటున్న జలీల్ ఖాన్
- తనకు టిక్కెట్ ఇవ్వకపోతే ఉరేసుకుంటానంటున్న జలీల్ ఖాన్
- బుద్ధా వెంకన్న, జలీల్ ఖాన్ వ్యాఖ్యలతో టీడీపీలో అయోమయం... జనసేన పార్టీలో కలవరం
- వెస్ట్ టిక్కెట్ పై ఆశలు పెట్టుకున్న జనసేన పోతిన మహేష్
8:00 AM, Feb 2nd, 2024
పురందేశ్వరి, పవన్లపై ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ధ్వజం
- ఊసరవల్లిలా పార్టీలు మారే పురందేశ్వరి వైఎస్సార్సీపీని విమర్శించడం తగదు
- పురందేశ్వరి బీజేపీ పగ్గాలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో పార్టీ విషతుల్యం అయ్యింది
- బీజేపీ నేతలు కార్యకర్తలు పురందేశ్వరి వ్యవహార శైలితో ఆవేదనకు గురవుతున్నారు
- పార్టీలు మారటం ఆవిడకి అలవాటు తర్వాత ఏ పార్టీలో ఉంటదో ఆవిడకే తెలియదు
- పురందేశ్వరి బీజేపీలో పనిచేస్తూ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేస్తుంది
- పురందేశ్వరి మాటలు విని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నవ్వుకుంటున్నారు
- సమాజ అభివృద్ధి కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఊసరవెల్లిలు విమర్శించడం హాస్యాస్పదం
- ఇచ్చిన వాగ్దానాలు నూటికి నూరు శాతం అమలు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్లాంటి నాయకుడిని భారతదేశ చరిత్రలో చూడలేదు
- రాష్ట్రంలో విద్య వైద్యం ఆర్థిక పరంగా ఏ కుటుంబం చితికి పోకూడదని ఆర్థిక విధానాన్ని నమ్మిన వ్యక్తి మా ముఖ్యమంత్రి
- భీమవరంలో నాపై పోటీ చేసేందుకు పవన్ కళ్యాణ్ భయపడుతున్నాడు
- పవన్ కళ్యాణ్ అయినా, చంద్రబాబు అయినా దమ్ముంటే నాపై ఒంటరిగా పోటీ చేసి గెలవాలి
- పవన్ కళ్యాణ్ మీకు భయం లేదంటే చంద్రబాబును ఒప్పించి భీమవరంలో నాపై ఇద్దరు పోటీ చేసి నాపై గెలవగలరా ఇది నా చాలెంజ్
7:40 AM, Feb 2nd, 2024
చంద్రబాబు సీట్లు అమ్ముకుంటారు: ఎంపీ కేశినేని నాని
- ఎన్నికల తర్వాత రాష్ట్రం వదిలి పారిపోతారు
- చంద్రబాబు ఎప్పుడూ ధనికుల కోసమే పనిచేస్తారు
- పేదల కోసం పనిచేస్తున్న సీఎం జగన్...
- జగన్తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం.. ఆయన వెంటే జనం
07:35 AM, Feb 2nd, 2024
కడప గడ్డపై కపట నాటకం..
- సూత్రధారి కుటలనీతి చంద్రబాబు
- పాత్రధారులు: షర్మిల, సునీత, బీటెక్ రవి, సీఎం రమేశ్ తదితరులు
- ఎంపీగా సునీత బరిలోకి దిగేలా షర్మిలతో బాబు రాయబారం
- కాంగ్రెస్లో చేరి పోటీ చేసేందుకు ఆమె విముఖత..
- దీంతో వివేకా భార్య సౌభాగ్యమ్మను నిలిపే ఆలోచన
- ఇండిపెండెంట్గా అయితే టీడీపీ మద్దతుంటుందని చర్చ
- కుటుంబీకుల మద్దతు కూడా అడగవచ్చనే ఆలోచన
- పైగా కుటుంబీకురాలికి మద్దతు ఇవ్వలేదని జగన్పై బురద వేయొచ్చు
- దీన్ని కడపలోను, రాష్ట్రవ్యాప్తంగానూ దుష్ప్రచారానికి వాడనున్న టీడీపీ
- వివేకా హత్య వ్యవహారంలో... ఎల్లో రాతలే అందరి అస్త్రాలు
- హంతకుడిని రక్షిస్తూ... టీడీపీతో అంటకాగుతున్న సునీత
- తన తండ్రిని అనైతికంగా ఓడించిన బీటెక్ రవితోనూ సాన్నిహిత్యం
- బీజేపీలో ఉన్న టీడీపీ నేతల నుంచీ ఆమెకు ఆర్థిక సహకారం
- షర్మిల భర్తతో, అటు రేవంత్రెడ్డితో కూడా బీటెక్ రవి మంతనాలు
- బాబు స్కెచ్ ప్రకారం కడపలో ‘కుటుంబ పోరు’ ఆవిష్కరించేందుకు కుట్ర
07:10 AM, Feb 2nd, 2024
పేదల ఇళ్లకు హక్కులు ఓర్వలేని రామోజీ
- పేదలపై మరోసారి తన అక్కసును వెళ్లగక్కిన రామోజీ
- ఇల్లులేని 31 లక్షల మందికి ఉచితంగా పట్టాలు ఇచ్చిన సీఎం జగన్
- ఇప్పుడు వాటిని రిజిస్టర్ చేసి ఇస్తున్నారు.
- అది చూడలేక కడుపు మంటతో రామోజీ తప్పుడు ప్రచారం.
పేదలపై మరోసారి తన అక్కసును వెళ్లగక్కాడు ఈనాడు రామోజీ. రాష్ట్రవ్యాప్తంగా ఇల్లు లేని 31 లక్షల మంది అక్కచెల్లెమ్మలకి ఉచితంగా పట్టాలు పంపిణీ చేశారు సీఎం వైయస్ జగన్. ఇప్పుడు వాటిని రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నారు. కానీ కడుపుమంటతో రామోజీ దుష్ప్రచారం చేస్తున్నాడు.#BanYellowMediaSaveAP pic.twitter.com/82iDqYfAtI
— YSR Congress Party (@YSRCParty) February 1, 2024
07:00 AM, Feb 2nd, 2024
ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పరారీ..
- నల్లధనం కేసులో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పరారీ
- తనిఖీకి వచ్చిన మైనింగ్, విజిలెన్స్ అధికారులపై దౌర్జన్యం.
- ఎమ్మెల్యే ఏలూరితో సహా ఎనిమిది మందిపై కేసు నమోదు
06:50 AM, Feb 2nd, 2024
కొవ్వూరు టీడీపీలో ముసలం
- తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు టీడీపీలో ముసలం
- కేఎస్ జవహర్కు టికెట్ ఇవ్వొద్దంటూ రోడ్డెక్కిన టీడీపీ కార్యకర్తలు
- గ్రూప్ రాజకీయాలు ప్రొత్సహిస్తున్నాడంటూ జవహర్పై ఆరోపణలు
- జవహర్కు కాకుండా ఎవరికి ఇచ్చినా ఓకే అంటున్న తెలుగు తమ్ముళ్లు
- ప్రత్యేకంగా సమావేశమై తీర్మానం చేసిన జవహర్ వ్యతిరేక వర్గం
- వేరే ఎవరికి ఇచ్చినా సమిష్టిగా గెలిపించుకునే ప్రయత్నం చేస్తామంటూ ప్రకటన
- లేకుంటే.. పరిణామాలు మరోలా ఉంటాయని అధినేత చంద్రబాబుకి సంకేతాలు పంపిన కేడర్
06:45 AM, Feb 2nd, 2024
ఇంతకీ పోటీ ఎక్కడ పవనూ?
- ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్!
- పోటీ ఎక్కడి నుంచి అనేదానిపై లేని క్లారిటీ
- జనసేనాని పోటీ ఎక్కడి నుంచో అని జనసేన శ్రేణుల్లో ఉత్కంఠ
- గత ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పవన్ పోటీ
- రెండింటిలోనూ ఓడిన పవన్ కల్యాణ్
- గాజువాక, భీమవరంలలో ఓడిపోవడానికి టీడీపే కారణమంటూ అప్పట్లో మండిపడ్డ జనసైనికులు
- పొత్తు వంకతో ఇప్పటికే అభ్యర్థుల్ని ప్రకటించుకుంటూ పోతున్న టీడీపీ
- పొత్తు ధర్మం పక్కనపెట్టినందుకు కౌంటర్ రియాక్షన్ ఇవ్వాలంటూ పవన్పై ఒత్తిడి
- ఈ క్రమంలోనే రెండు స్థానాల ప్రకటన
- అయినా లెక్క చేయని టీడీపీ అధినేత చంద్రబాబు
6:30 AM, Feb 2nd, 2024
తెలుగుదేశం.. గందరగోళం
- టీడీపీ అధిష్టానంలో గందరగోళ పరిస్థితి
- సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారుపై ఎడతెగని కసరత్తులు
- నిన్నంతా హైదరాబాద్ చంద్రబాబు చర్చలు
- నియోజకవర్గాల నేతలు, ఆశావహులకు ఏం చెప్పలేని పరిస్థితుల్లో చంద్రబాబు
- క్షేత్రస్థాయిలో దిగజారుతున్న పరిస్థితి
- పొత్తుల కత్తెరలో ఎటూ తేల్చుకోలేకపోతున్న చంద్రబాబు
- ఏదో ఒకటి తేల్చాలని జనసేన నుంచి ఒత్తిడి
- ఎన్ని సీట్లు ఇస్తారు? ఎక్కడ చోట్ల పోటీ చేయాలి?
- తొందరపడి ఇటీవల రెండు సీట్లు ప్రకటించిన చంద్రబాబు
- పోటీగా తాను రెండు ప్రకటించిన పవన్ కళ్యాన్
- రేపు చంద్రబాబు 50 ప్రకటిస్తే.. పవన్ కూడా 50 సీట్లు ప్రకటిస్తాడా?
- ఎన్నికలు సమీపిస్తున్నా.. కసరత్తు చివరి దశకు రాదా?
- మ్యానిఫెస్టో అటకెక్కినట్టేనా?
- సీట్లపై పీఠముడి వీడేదెప్పుడు?
- ఎంపీ స్థానాల విషయంలోనూ ఇదే సందిగ్ధతా?
- ఇప్పుడు YSRCP ఎమ్మెల్యేలవైపు చూపులెందుకు?
- క్యాడర్కు ఎన్నాళ్లు వెన్నుపోటు పొడుస్తారు?