సాక్షి ప్రతినిధి కడప/బద్వేలు: వైఎస్సార్ జిల్లా బద్వేలు అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో గౌరవప్రదమైన ఓట్లను దక్కించుకోవడంపై బీజేపీ నేతలు ప్రధానంగా దృష్టి సారించారు. గత మూడు పర్యాయాలుగా అక్కడ పోటీ చేసినా పట్టుమని ఏడు వందల ఓట్లు కూడా రాకపోవడంతో లోపాయికారీగా టీడీపీ మద్దతు కూడగడుతున్నారు. ఈసారి టీడీపీ బరిలో లేనందున ఓట్ల శాతాన్ని పెంచుకునేందుకు బీజేపీలో చేరిన సీఎం రమేష్, ఆదినారాయణరెడ్డి తదితరుల ద్వారా పావులు కదుపుతున్నారు. బీజేపీ నాయకులు వీరితో కలసి స్థానిక టీడీపీ నేతల ఇళ్ల వద్దకు వెళ్లి ఆ పార్టీ క్యాడర్ తమకు మద్దతిచ్చేలా చూడాలని కోరుతున్నారు. టీడీపీ కార్యకర్తలు, మద్దతుదారులకు ఫోన్లు చేయిస్తూ తమకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు.
వ్యతిరేకిస్తున్న టీడీపీ క్యాడర్
బద్వేలులో బీజేపీకి క్యాడర్ లేకపోవడంతో అత్యధిక పోలింగ్ బూత్ల్లో ఏజెంట్లు దొరకక టీడీపీ కార్యకర్తలను తమవైపు తిప్పుకుంటున్నారు. కొన్ని చోట్ల డబ్బులు ఎర వేసి ప్రలోభాలకు గురి చేస్తున్నారు. వరుస పరాభవాలతో ఈ ఎన్నికలో పోటీకి టీడీపీ దూరంగా ఉండటంతో స్థానికేతరుడైన పనతల సురేష్ను బీజేపీ తన అభ్యర్థిగా నిలిపింది. వాస్తవానికి నియోజకవర్గంలో బీజేపీకి నామమాత్రంగా కూడా కార్యకర్తలు లేరు.
ఈ నేపథ్యంలో కాశినాయన మండల కేంద్రమైన నరసాపురానికి చెందిన టీడీపీ నేత కర్నాటి వెంకటరెడ్డితో బీజేపీ నేతలు సోము వీర్రాజు, ఆదినారాయణరెడ్డి, సీఎం రమేష్ స్వయంగా చర్చలు జరిపి తమకు అనుకూలంగా వ్యవహరించేలా ఒప్పందాలు చేసుకున్నారు. పోరుమామిళ్ల, బద్వేలు ప్రాంతాల్లోనూ ఇదే తరహా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు.
టీడీపీ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ తనయుడు రితేష్రెడ్డితో ఇప్పటికే బీజేపీ నేతలు చర్చలు జరిపారు. కొందరు టీడీపీ నాయకులు, కార్యకర్తలు మాత్రం అక్రమ పొత్తులను వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. పోటీ చేయరాదని పార్టీ నాయకత్వం నిర్ణయించినందున తమ అభీష్టం ప్రకారం ఓటు వేయనివ్వాలని సూచించినట్లు సమాచారం.
బద్వేలు బరిలో లోపాయికారీ పొత్తులు!
Published Fri, Oct 29 2021 3:00 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement