సీఎం రేవంత్‌తో ప్రకాశ్‌గౌడ్‌ భేటీ | Sakshi
Sakshi News home page

సీఎం రేవంత్‌తో ప్రకాశ్‌గౌడ్‌ భేటీ

Published Mon, Jan 29 2024 1:15 AM

BRS MLA Prakash Goud Meets CM Revanth Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/మణికొండ: బీఆర్‌ఎస్‌ రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ ఆదివారం ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డిని కలిశారు. జూబ్లీహి ల్స్‌లోని సీఎం నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు. రేవంత్‌ సన్నిహితుడు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. దీనితో ప్రకాశ్‌గౌడ్‌ బీఆర్‌ఎస్‌ను వీడి, కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారని ప్రచారం జరిగింది. దీనిని ప్రకాశ్‌గౌడ్‌ ఖండించారు.

మర్యాదపూర్వకంగానే కలిశా: ప్రకాశ్‌గౌడ్‌
తాను మర్యాదపూర్వకంగానే సీఎం రేవంత్‌తో భేటీ అయ్యానని ప్రకాశ్‌గౌడ్‌ పేర్కొన్నారు. తాను ప్రాతి నిధ్యం వహిస్తున్న రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలోని శంషాబాద్‌ మండలం కొత్వాల్‌గూడ, బహ దూర్‌గూడ, ఘాన్సిమియాగూడ గ్రామాల్లో భూసంబంధ సమస్యల పరిష్కారం కోసమే సీఎంను కలి శానని ఓ ప్రకటనలో తెలిపారు. నియోజకవర్గ అభి వృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని తాను కోరగా.. సీఎం సానుకూలంగా స్పందించారన్నారు. భేటీ వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని, తాను కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని పేర్కొన్నారు.

Advertisement
Advertisement