జరగబోయేది క్లాస్‌ వార్‌.. జగన్‌ గెలిస్తేనే పేదవాడికి న్యాయం | Sakshi
Sakshi News home page

జరగబోయేది క్లాస్‌ వార్‌.. జగన్‌ గెలిస్తేనే పేదవాడికి న్యాయం

Published Tue, Feb 27 2024 7:05 PM

CM Jagan Key Comments At YSRCP Booth Level Meeting - Sakshi

రాజకీయాల్లో విశ్వసనీయత ముఖ్యం

చంద్రబాబు ఇచ్చినవి చెత్త హామీలు

దేశంలో విశ్వసనీయత ఉన్న ఏకైక పార్టీ వైఎస్సార్‌సీపీ

మనం చెప్పేది చేస్తాం.. చేసేదే చెప్తాం

57 నెలల కాలంలో పేదల సంక్షేమం కోసం పని చేశాం 

పేదలకు నాణ్యమైన విద్య.. మహిళలకు దిశతో రక్షణ..  విప్లవాత్మక మార్పులెన్నో తీసుకొచ్చాం

లంచాల్లేని, వివక్ష లేని పాలన అందించాం

పేదల ఖాతాల్లో రూ.2 లక్షల 55 వేల కోట్లు జమ చేశాం

ఇంత మంచి చేసినప్పుడు మెజారిటీ ఎందుకు రాదు

గతంలో 151 సీట్లు నెగ్గినప్పుడు.. ఇంత మంచితో 175 ఎందుకు గెలవలేం?

జరిగిన మంచిని ఇంటింటికి వెళ్లి వివరంగా చెప్పండి

వైఎస్సార్‌సీపీ టికెట్లు దాదాపు కన్ఫర్మ్‌ అయ్యాయి

నా వంతు నేను చేశా.. ఇక మీ వంతు

ప్రతీ ఒక్కరూ రెట్టించిన ఉత్సాహంతో ఓటర్లలోకి వెళ్లండి

వైఎస్సార్‌సీపీ గెలవకుంటే సంక్షేమం ఆగిపోతుందని చెప్పండి

ఇది పేదలకు-పెత్తందారీలకు మధ్య యుద్ధం

ఈ క్లాస్‌ వార్‌లో జగన్‌ గెలిస్తేనే పేదలకు న్యాయం

మేం సిద్ధం- మా బూత్ సిద్ధంలో సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు

గుంటూరు, సాక్షి: అబద్ధాలు చెప్పడంలో నేర్పరి అయిన చంద్రబాబు.. గతంలో  ఎన్నికల సమయంలో ఇచ్చిన చెత్త హామీలు తనకు ఇంకా గుర్తున్నాయని.. కానీ, అలా ఆచరణ సాధ్యంకాని హామీలతో ప్రజల్ని మభ్యపెట్టడం వైఎస్సార్‌సీపీ అభిమతం ఎంతమాత్రం కాదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మంగళగిరిలో ఇవాళ సాయంత్రం జరిగిన వైఎస్సార్ సీపీ విస్తృత స్థాయి సమావేశం ‘మేం సిద్ధం- మా బూత్ సిద్ధం’ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 

అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలకు కేడర్‌ను సమాయత్తం చేసే ఈ మీటింగ్‌లో సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ‘‘2024 ఎన్నికలకు సిద్ధమయ్యాం.  రాష్ట్రంలో మనం గ్రౌండ్ లెవల్ నుంచి మనం బలంగా ఉన్నాం. రేపటి నుంచి 45 రోజులు మనకు కీలకం. పూర్తి విశ్వాసంతో మనం చేసిన మంచిని.. చేసే మంచిని ప్రజలకు చెప్పండి.  గతంలో బంగారు రుణాలు, రైతు రుణ మాఫీ ఇలా చంద్రబాబు ఇచ్చిన చెత్త ప్రకటనలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి.  అబద్ధాలు చెప్పటంలో చంద్రబాబు నేర్పరి. కనీసం సాధ్యమవుతుందో లేదో కూడా తెలియకుండానే చంద్రబాబు ఈ వాగ్దానాలన్నీ చేశారు. మనం అలా చేయము. మనం చెప్పేది చేస్తాం! చేసేదే చెప్తాం!. 

.. రాజకీయాల్లో విశ్వసనీయత ముఖ్యం. చంద్రబాబుకి అది లేదు. ⁠గతంలో చంద్రబాబు ఇచ్చిన దొంగ హామీలు నాకు గుర్తున్నాయి.  2014లో చంద్రబాబు అది చేస్తాం ఇది చేస్తాం అంటూ హామీలిచ్చారు. సాధ్యపడని హామీలను కూడా మేనిఫెస్టోలో పెట్టారు.  అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశారు ఇచ్చిన హామీలు నేరవేర్చకపోగా వారి పార్టీ వెబ్‌సైట్‌లో నుంచి టీడీపీ మేనిఫెస్టోను కూడా తీసేసింది. వారి కార్యకర్తలు ప్రజల వద్దకు వెళ్లి ఏం చెబుతారు?. ఒక హామీ ఒక నాయకుడు ఇచ్చాడంటే దానికి విశ్వసనీయత ఉండాలి. దేశంలో విశ్వసనీయత ఉన్న ఏకైక పార్టీ వైఎస్సార్‌సీపీ. అధికారంలోకి రాగానే మేం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాం. ప్రజలు మాకు నమ్మకంతో ఓట్లు వేశారు. ఇప్పుడు, నా కార్యకర్తలందరూ సగర్వంగా ప్రతి ఇంటిని సందర్శించి, మేం నేరవేర్చిన మెనిఫెస్టో వాగ్దానాలలో ప్రతి ఒక్కటి ఎలా చేసి చూపించామనేదాని గురించి మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. విపక్షాలు చేసే విషప్రచారం తిప్పి కొట్టండి.. అని సీఎం జగన్‌ కేడర్‌కు పిలుపు ఇచ్చారు. 

మన మేనిఫెస్టో మన భగవద్గీత, ఖూరాన్, బైబిల్. కానీ టీడీపీకి మాత్రం మేనిఫెస్టో చెత్తబుట్టలో పడేసేదానిగానే చూస్తారు, వాళ్లు పేదల గురించి పట్టించుకోరు. ఇదంతా నమ్మకానికి సంబంధించింది. జగన్ చేస్తానని చెబితే చేస్తాడు! ఆలోచించి ఆచి తూ.చి.న తర్వాతే జగన్ వాగ్దానాలు చేస్తారు. తప్పుడు హామీలు ఎప్పుడు మనం ఇవ్వలేదు, ఇవ్వం కూడా. మనం ఏది ఇవ్వగలమో.. అది చెబుతున్నాం. చంద్రబాబు మాత్రం అలా కాదు.  ⁠ఇచ్చిన హామీలు నేరవేర్చకపోగా వారి పార్టీ వెబ్‌సైట్‌లో నుంచి టీడీపీ మేనిఫెస్టోను కూడా తీసేసింది. వారి కార్యకర్తలు ప్రజల వద్దకు వెళ్లి ఏం చెబుతారు?. మోసం ఎప్పుడూ నిలబడదు. 

కానీ, 2019లో మనం అమలు చేయగలిగే హామీలిచ్చాం. అధికారంలోకి రాగానే మేం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాము. 99 శాతం హామీలన్నింటిని నెరవేర్చాం. ప్రజలు మాకు నమ్మకంతో ఓట్లు వేశారు. ఫలితంగా.. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 151 నియోజకవర్గాల్లో విజయం సాధించాం. ఆనాడు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయగలరా? అని అడిగారు. ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేసి తీరతామని ఆనాడు చెప్పా. కాబట్టే.. ఇది చెప్పాం .. ఇది చేశాం అని ఇంటింటికి వెళ్లి చెప్పగలుగుతున్నాం. ఇప్పుడు, నా కార్యకర్తలందరూ సగర్వంగా ప్రతి ఇంటిని సందర్శించి, మేం నేరవేర్చిన మేనిఫెస్టో వాగ్దానాలలో ప్రతి ఒక్కటి ఎలా చేసి చూపించామనేదాని గురించి మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. విపక్షాలు చేసే విషప్రచారం తిప్పి కొట్టండి.. అని సీఎం జగన్‌ కేడర్‌కు పిలుపు ఇచ్చారు. 

.. ఈ ఎన్నికల్లో జరిగేది క్యాస్ట్ వార్ కాదు, క్లాస్ వార్. మీరందరూ ప్రతి ఇంటికి వెళ్లి జగన్ ఉంటే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని చెప్పాలి. వైఎస్‌ఆర్‌సీపీకి ఓటు వేయకపోతే మన ప్రభుత్వంలో వస్తున్న సంక్షేమం అంతా ఆగిపోతుందని అందరికీ అవగాహన కల్పించాలి.. మన వ్యవస్థే మనకు అత్యంత ముఖ్యమైనది. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలందరు తమ బూత్ సామర్థ్యాన్ని  అంచనా వేయాలి. బూత్‌స్థాయిలో పార్టీని వీలైంత తొందరగా యాక్టివేట్‌ చేయండి. ప్రతి గ్రామ సచివాలయాన్ని ఒక యూనిట్ గా తీసుకోండి. ఒక విశ్వసనీయ వ్యక్తిని నియమించండి. ఈ వ్యక్తి  మన కార్యకర్తలను  సన్నద్ధం చేయడంతోపాటు వారిని పర్యవేక్షించగలగాలి.



.. అయితే మీరందరూ ఎల్లవేళలా వారికి అందుబాటులో ఉండాలి. అర్ధరాత్రి కాల్స్ వచ్చినా, మీరు వాటికి సమాధానం ఇవ్వాలి. బూత్‌స్థాయిలో ఓటర్లను ఎన్నికలలోపు కనీసం ఐదారుసార్లు కలివండి. వలంటీర్లు, గృహ సారథిలతో సమన్వయపరచుకుంటు వారితో కలిపి ఒక సొంత బృందాన్ని తయారు చేసుకోండి. అందులో ప్రతి బూత్ బృందంలో 15 నుంచి 18 మంది బూత్ సభ్యులు ఉంటారు.

.. మా ప్రభుత్వానికి ఘనమైన రికార్డు ఉంది. మనం గొప్పగా పని చేశాం. ఇప్పుడు మన దృష్టి కేవలం మన నూతన వ్యవస్థ పై మాత్రమే పెట్టాలి. మనం మంచి చేశామనే తృప్తితో ప్రజల వద్దకు వెళ్లండి. మనం అందరికీ మంచి చేసినట్లయితే, పూర్తి మెజారిటీతో ఎందుకు గెలవలేము!. ఆ మెజారిటీ కుప్పం నుంచే ప్రారంభం కావాలి. నా స్థాయిలో నేను చేయగలిగినదంతా చేశాను. 

మన పథకాలతో 87 శాతం పైచిలుకు కుటుంబాలకు సంక్షేమం అందించాం. ఒక కుప్పంలో 93 శాతం కుటుంబాలకు మేలు చేశాం. కుప్పంలో 87 వేల ఇళ్లు ఉంటే.. 83 వేల ఇళ్లకు మంచి జరిగింది. కుప్పంలో 45 వేల కుటుంబాలకు రూ.1,400 కోట్లు ఇచ్చాం. రాష్ట్రవ్యాప్తంగా జగన్‌ బటన్‌ నొక్కడం.. పేదల ఖాతాల్లో నేరుగా డబ్బు జమ చేశాం. ఏకంగా రూ.2 లక్షల 55 వేల కోట్లు అక్కచెల్లెమ్మల ఖాతాలో జమ చేశాం. కాబట్టే.. మనం చేసిన మంచి చూసి ప్రత్యర్థుల గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి. 

ఈ 57 నెలల్లో పూర్తి ప్రక్షాళన జరిగింది.. సంక్షేమ పాలన అందించాం. పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. గతంలో వెయ్యి రూపాయలు ఉన్న ఫించన్‌.. 3 వేలకు చేశాం. పేదలకు క్వాలిటీ ఎడ్యుకేషన్‌ అందుబాటులోకి తెచ్చాం.  ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్‌ మీడియం అందుబాటులోకి తెచ్చాం. లంచాలు వివక్ష లేకుండా ప్రతీ ఇంటికి సంక్షేమం అందించాం. నాడు-నేడు ద్వారా స్కూళ్ల రూపురేఖలు మార్చేశాం. దిశ యాప్‌తో మహిళలకు భద్రత కల్పించాం.దిశ యాప్‌తో పోలీసులు త్వరగా స్పందిస్తున్నారు. ఫోన్‌ చేస్తే చాలూ మహిళలకు రక్షణ దొరుకుతోంది. ఆరోగ్యశ్రీని అత్యుత్తమ స్థాయిలో విస్తరించాం. లంచాలకు, వివక్షలకు తావు లేకుండా సంక్షేమ పాలన అందించాం. 

ఇవాళ జరుగుతోంది కులాల మధ్య యుద్ధం కాదు. ఓసీల్లో కూడా నిరుపేదలు ఉన్నారు. పేదలు ఓవైపు ఉంటే.. పెత్తందారులు మరోవైపు ఉన్నారు. జగన్‌ ఎప్పుడూ పేదల వైపే ఉంటాడు. జగన్‌ గెలిస్తే పేదవాడికి న్యాయం జరుగుతుంది. మీ జగన్‌ ఉంటే పేదవాడు బాగుపడతాడు. జగన్‌ ఉంటే లంచాలు లేకుండా బటన్‌లు కొనసాగుతాయి. జగన్‌ ఉంటేనే విలేజ్‌ క్లినిక్‌లు పని చేస్తాయి.  జగన్‌ రాకుంటే మళ్లీ జన్మభూమిలదే రాజ్యమవుతుంది. సంక్షేమం కొనసాగాలంటే జగనే సీఎంగా ఉండాలి. జగన్‌ చేయగలిగింది మాత్రమే చెబుతాడు. చంద్రబాబు మాత్రం ఎలాంటి అబద్ధం అయినా చెబుతాడు. చంద్రబాబు మాత్రం తన అవసరాల కోసం ఎవరినైనా మోసం చేస్తాడు. 

.. 45 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. పేదవాడు బాగుపడాలంటే వైఎస్సార్సీపీ రావాల్సిందే. జరిగిన మంచిని బాగా చెప్పగలిగితేనే విజయం సాధిస్తాం. నా స్థాయిలో నేను చేయగలిగినదంతా చేశా. ఇప్పుడు మీ వంతు వచ్చింది. రెట్టించిన ఉత్సాహంతో ఓటర్లలోకి వెళ్లండి.   ఇప్పటి వరకు అన్ని అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించేశాం, దాదాపు ఇవే ఫైనల్, టికెట్ల గురించి మీరు ఆలోచించక్కర్లేదు. మీరు చేయాల్సిందల్లా లబ్ది పోందిన ప్రతి గడపకు వెళ్లి మనం చేసిన మంచిని ఒట్లుగా మార్చుకోవటమే. పూర్తి విశ్వాసంతో ప్రతి ఇంటికి వెళ్లండి. పేదలకు మంచి చేశామని, ఇప్పుడు మీ మద్దతు మాకు అవసరమని చెప్పండి. గతంలో 151 సీట్లు వచ్చాయి కాబట్టి.. ఈసారి 175కి 175 స్థానాలు గెలవాల్సిందే.  మన లక్ష్యం 175/175 అని గుర్తుంచుకోండి. 25కి 25 పార్లమెంట్‌ స్థానాలు గెలవాలి. ఆల్ ది బెస్ట్ అని సీఎం జగన్‌ ప్రసంగించారు.

Advertisement
Advertisement