మహిళా ప్రాతినిధ్యం మరింత పెంచుతాం: సీఎం జగన్‌ | Sakshi
Sakshi News home page

మహిళా ప్రాతినిధ్యం మరింత పెంచుతాం: సీఎం జగన్‌

Published Sat, Mar 16 2024 2:13 PM

CM YS Jagan Comments Over YSRCP Candidates List - Sakshi

సాక్షి, ఇడుపులపాయ: వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల జాబితా చరిత్రలో నిలిచిపోయే ఘట్టం. రాష్ట్రంలో మహిళల కోసం ఎంతో చేశాం. వారికి ఎంతో సామాజిక న్యాయం చేసినా అది కూడా నాకు స‍ంతృప్తిని ఇవ్వడంలేదన్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో మహిళల కోసం మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తామన్నారు. ఈ స్థాయిలో మార్పులు చేయగలిగిన ధైర్యం ఎవరికీ ఉండకపోవచ్చు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఇంత ధైర్యం ఉందని, ప్రజల మీద ఆ మేరకు నమ్మకం ఉందని కూడా చెప్పడానికి సంతోషపడుతున్నాను అని అన్నారు. 

కాగా, ఇడుపులపాయలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రకటన అనంతరం సీఎం జగన్‌ మాట్లాడుతూ..

  • ఈరోజు రిలీజ్ చేస్తున్న ఈ లిస్టు 25 పార్లమెంట్‌ స్థానాలకు, 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన లిస్టు ఇది. 
  • ఇందులో ఒకే ఒక అనకాపల్లి ఎంపీ స్థానం ఒక్కటి పెండింగ్ పెట్టాం. మిగతావి లిస్ట్ అనౌన్స్‌ అయినట్లే.
  • ఎప్పుడూ చూడని విధంగా సామాజిక న్యాయం అన్నది మాటల్లోనే కాదు..
  • చేతల్లో కూడా చేసి చూపించగలిగాం దేవుడి దయతో అని చెప్పడానికి సంతోషపడుతున్నా.
  • 50 శాతం కచ్చితంగా నా అని సంబోధిస్తూ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు కచ్చితంగా అమలయ్యేలా చట్టం చేసిన ప్రభుత్వం మనది.
  • మొత్తం ఈరోజు 200 స్థానాలకు గానూ 100 స్థానాలు అంటే 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చాం
  • నా అని పిలుచుకుంటూ 50 శాతం సీట్లు ఏకంగా వీరికే ఇవ్వగలగడం ఇది చరిత్రలో, ఆంధ్ర రాష్ట్ర హిస్టరీలో ఎప్పుడూ కనీవినీ ఎరుగని ఘట్టం.
  • ఏకంగా 59 స్థానాలు బీసీలకే కేటాయింపులు చేశాం.
  • 175 అసెంబ్లీ స్థానాలకు 48 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు గానూ 11 స్థానాలుబీసీలకే కేటాయింపులు జరిగింది.
  • మహిళలకు ఇంతకుముందుకన్నా బెటర్‌గా చేశాం. 
  • ఇది కూడా నాకు సంతృప్తిని కలిగించడం లేదు. 
  • వచ్చే ఎన్నికలు వచ్చే సరికి ఇంకా వేగంగా అడుగులు వేయించే కార్యక్రమం చేస్తున్నాం. 
  • 200 స్థానాలకు 22 స్థానాలు అంటే 12 శాతం అక్కచెల్లెమ్మలకు ఇవ్వగలిగాం. 
  • లాస్ట్ టైమ్ కన్నా బెటర్‌గా చేశాం, 19ఇస్తే ఈసారి 24 దాకా తీసుకుపోగలిగాం. 
  • ఇది కూడా ఒక విశేషం అనే చెప్పాలి. 
  • వచ్చే ఎన్నికలు వచ్చేటప్పటికి ఇంకా పెద్ద సంఖ్యలో నంబర్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. 
  • ఏకంగా 77 శాతం మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు.. గ్రాడ్యుయేట్లు, ఆపై చదువులు చదివిన వారు.
  • ఎమ్మెల్యేలకు సంబంధించి 175 మంది ఎమ్మెల్యేలకు గానూ 75 శాతం గ్రాడ్యుయేట్లు, ఆ పై చదువులు చదివిన వారిని మనం ఎంపిక చేయగలిగాం. 
  • మైనార్టీలకు ఇంతకు ముందు 5 స్థానాలిస్తే ఇవాళ 7 స్థానాలకు పెంచగలిగాం. 
  • మొత్తం మీద 50 శాతం నా నా నా అని పిలుచుకుంటూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇవ్వడం చరిత్రలో నిలిచిపోతుందని చెబుతున్నా.

ఈ ఎన్నికల్లో దాదాపు 81 స్థానాల్లో ఎమ్మెల్యేల మార్పు, 18 ఎంపీ స్థానాల మార్పు జరిగింది. దాదాపుగా 50 శాతం స్థానాల్లో మార్పులు చేశాం. ఇది కూడా చరిత్రలో నిలిచిపోయే ఘట్టమే. ఈ స్థాయిలో మార్పులు చేయగలిగిన ధైర్యం ఎవరికీ ఉండకపోవచ్చేమో. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ధైర్యం ఉందని, ప్రజల మీద ఆ మేరకు నమ్మకం ఉందని కూడా చెప్పడానికి సంతోషపడుతున్నా.

మార్పు కాబడిన వారికి, టికెట్ రాని వారికి మనస్పూర్తిగా చెబుతున్నా. రాబోయే రోజుల్లో దేవుడి దయతో, ప్రజలందరి ఆశీస్సులతో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్లందరికీ సముచిత స్థానం ఇస్తూ ఏదో ఒక రూపంలో దగ్గరకు తీసుకునే కార్యక్రమం జరుగుతుందని వాళ్లందరికీ భరోసా ఇస్తున్నా. కనీవినీ ఎరుగని విప్లవాత్మక మార్పులతో ఈ ఐదు సంవత్సరాల పాలన జరిగింది. రూ.2.70 లక్షలకోట్లు నేరుగా బటన్ నొక్కడం, ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్లి పోవడం జరిగింది. 

రాష్ట్ర చరిత్రలో ఇది ఎప్పుడూ చూడలేదు. ఎప్పుడూ జరగని ఘట్టం. లంచాలు లేకుండా ఇవ్వడం సాధ్యమేనా? వివక్ష లేకుండా ఇవ్వగలుగుతారా? అనే పరిస్థితి నుంచి కాదు.. ఇది సాధ్యమే అని 5 సంవత్సరాల పరిపాలనలో గ్రామ స్థాయిలో గ్రామ సచివాలయాలు, 50-60 ఇళ్లకు వాలంటీర్ వ్యవస్థ తీసుకుని రావడం, వీటన్నిటి ద్వారా పారదర్శకత, లంచాలు, వివక్షకు చోటు లేని వ్యవస్థ ద్వారా రూ.2.70 లక్షల కోట్లు అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెయ్యడం అనేది దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ విషయంగా గుర్తుండిపోతుంది. 

ఈ ఒక్కటే కాకుండా గ్రామాలు మారాయి, గ్రామాల్లో పరిస్థితులుమారాయి, స్కూళ్లు, ఆస్పత్రులు బాగుపడ్డాయి. వ్యవసాయం బాగుపడింది. ఉమెన్ ఎంపవర్ మెంట్ జరిగింది. సామాజిక న్యాయం అన్నది మాటలకు కాదు.. మొట్టమొదటిసారిగా సాధ్యమే అని చేసి చూపించిన ప్రభుత్వంగా ఈరోజు వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడగలిగిందని చెప్పడానికి గర్వపడుతున్నా. వీటన్నిటివల్ల ప్రస్పుటమైన మార్పులు ప్రతి గ్రామంలో కనిపిస్తున్నాయి. ఈ మార్పులన్నింటి వల్ల దేవుడి ఆశీస్సులతో మళ్లీ 2-3 నెలల్లో కచ్చితంగా ప్రమాణ స్వీకారం చేస్తాం. సామాజిక న్యాయం అన్నది ఇంకా గొప్ప స్థాయిలోకి తీసుకుని పోయే అడుగులు కూడా వేస్తాం అని చెబుతూ అందరితో సెలవు తీసుకుంటున్నా’ అని అన్నారు. 

Advertisement
Advertisement