సాక్షి, గుంటూరు: వ్యవస్థలను మేనేజ్ చేయడమే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పని అని ఆ పార్టీ రాష్ట్ర స్థాయి నాయకత్వ శిక్షణ కేంద్రం డైరెక్టర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసరి రాజా మాస్టారు విమర్శించారు. ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని తప్పులను సరిదిద్దుకోవడం వదిలి ప్రభుత్వాన్ని బలహీనపరచడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో టీడీపీకి, పార్టీ పదవులకు రాజీనామా చేసినట్టు గుంటూరులో శుక్రవారం విలేకరులకు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. 32 ఏళ్లుగా పార్టీ బలోపేతానికి తాను ఎంతో కృషి చేసినట్టు చెప్పారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలైన అనంతరం చంద్రబాబు తీరులో మార్పు వస్తుందని ఎదురుచూస్తూ వచ్చానన్నారు. అయితే మార్పు రాలేదన్నారు.
గడిచిన రెండు రోజుల్లో నిర్వహించిన వర్చువల్ మహానాడు కార్యక్రమం చంద్రబాబును పొగడటం, సీఎం జగన్పై విమర్శలు చేయడానికే పరిమితమైందన్నారు. రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్గా టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో గుంటూరు నగరంలో ఉన్న రెండు మేజర్ గ్రంథాలయాలకు మాజీ సీఎంలు వైఎస్ రాజశేఖరరెడ్డి, ఎన్టీ రామారావుల పేర్లు పెట్టాలని ప్రతిపాదన చేస్తే చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. గ్రంథాలయానికి రామారావు పేరు పెట్టడానికి విముఖత చూపిన బాబు ఆయన ఫొటోలకు దండలు వేస్తూ, నివాళులు అర్పిస్తూ పార్టీ నాయకులను, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకొనే చంద్రబాబు టీడీపీ అధికారంలో ఉన్న 2014–19 మధ్యకాలంలో గుంటూరులోని అప్పటి రాష్ట్ర, ప్రస్తుత జిల్లా పార్టీ కార్యాలయం పక్కనే నివసిస్తున్న పేద ప్రజల అభివృద్ధికి ఎందుకు కృషి చేయలేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీని చేస్తానని తనకు మాటిచ్చి చివరి నిమిషంలో మోసం చేశాడని గుర్తు చేసుకున్నారు. టీడీపీలో భవిష్యత్తు లేదని నిర్ధారణకు వచ్చిన తాను పార్టీ వీడుతున్నట్టు తెలిపారు. రాజా మాస్టారుతో పాటు గుంటూరు జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు యర్రగోపు నాగేశ్వరరావు కూడా పార్టీని వీడారు.
వ్యవస్థలను మేనేజ్ చేయడమే బాబు పని
Published Sat, May 29 2021 4:19 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సికింద్రాబాద్–ఖుర్దారోడ్ మధ్య స్పెషల్ రైళ్లు
అవినీతి శ్రీశైలం కొండంత
బీజేపీ అభ్యర్థిపై ‘ఆప్’ ఆంక్షలు.. తగ్గేదే లేదన్న క్యాండిడేట్!
చంద్రబాబు బాటలోనే రెండు కళ్ల సిద్ధాంతం అంది పుచ్చుకున్న బిజెపి
జిల్లాలో 14,162 వేల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగం
సింహగిరి.. భక్త ఝరి
ఎన్నికల విధుల్లో ట్రైనీ ఐపీఎస్ అధికారులు
వైఎస్సార్సీపీలో భారీగా చేరికలు
రేపే అప్పన్న చందనోత్సవం
రాజకీయ పోరు
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఐదో విడత బరిలో..695 మంది
- అ్రస్టాజెనెకా టీకాలు వెనక్కి
- ఐఏఎఫ్ కాన్వాయ్పై దాడి ఘటన..
- చంద్రబాబు ట్రాప్లో షర్మిల, సునీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్!
- భరత్.. వైజాగ్ ఇప్పుడు గుర్తొచ్చిందా?
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Advertisement