ఎన్నికల ప్రచారంలో డింపుల్‌ యాదవ్‌ సంచలన వ్యాఖ్యలు | Sakshi
Sakshi News home page

ఎన్నికల ప్రచారంలో డింపుల్‌ యాదవ్‌ సంచలన వ్యాఖ్యలు

Published Tue, Apr 23 2024 6:13 PM

Dimple Yadav Comments On State Bjp, And Central Bjp Regime - Sakshi

పాట్నా : అటు కేంద్రం బీజేపీని ఓడిస్తే.. ఇటు రాష్ట్రంలో కూడా ఆ పార్టీని ప్రతిపక్షంలో కూర్చొబెట్టొచ్చంటూ ఉత్తర్‌ప్రదేశ్‌ స‌మాజ్‌వాదీ పార్టీ, మెయిన్‌పురి ఎంపీ అభ్యర్ధి డింపుల్ యాద‌వ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

మెయిన్‌పురిలో డింపుల్ యాదవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడుతూ..‘రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకే ఈ లోక్‌సభ ఎన్నికలు. సమాజంలోని ప్రతి వర్గం నిర్లక్ష్యానికి గురవుతోంది. బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం అబద్ధాలు, దోపిడి ప్రభుత్వమని రాష్ట్రం, దేశం మొత్తం తెలిసిపోయిందని అన్నారు. అందుకే ఈ సారి లోక్‌సభ ఎన్నికల్ని చాలా తెలివిగా ఎదుర్కోవాలని ఓటర్లకు పిలునిచ్చారు.  

రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్న ప్రభుత్వాన్ని ఓడించారు. అందుకు ఈ ఎన్నికలే మనకు ఆయుధం. ఈ (బీజేపీ) ప్రభుత్వాన్ని కేంద్రం నుండి తొలగిస్తే, అప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని తొలగించే పని కూడా జరగవచ్చు అని అన్నారు. కాగా, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ సతీమణీయే డింపుల్‌ యాదవ్‌  

Advertisement
Advertisement