తాజా సంచలన సర్వే.. తెలంగాణలో ఆ పార్టీదే అధికారం.. | Sakshi
Sakshi News home page

తాజా సంచలన సర్వే.. తెలంగాణలో ఆ పార్టీదే అధికారం..

Published Sat, Oct 21 2023 7:39 PM

India Tv Survey: Telangana Election Opinion Poll - Sakshi

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి నెలకొంది. ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ప్రకటన, ప్రచారాలపై దృష్టిసారించాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి రాబోతోందని ఇండియా టీవీ సర్వే తేల్చిచెప్పింది.

ఒపీనియన్ పోల్స్ ఫలితాలను విడుదల చేసిన ఇండియా టీవీ.. బీఆర్ఎస్‌కు 70, కాంగ్రెస్‌కు 34, బీజేపీకి 7, ఎంఐఎంకు 7 సీట్లు వస్తాయని పేర్కొంది. కాగా, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు 88, కాంగ్రెస్‌కు 19, ఎంఐఎం 7, ఇతరులు నాలుగు చోట్ల విజయం సాధించారు.


 

Advertisement
Advertisement