పైసాకు కూడా పనికిరాని పవన్‌ | Sakshi
Sakshi News home page

పైసాకు కూడా పనికిరాని పవన్‌

Published Thu, Apr 25 2024 3:37 PM

The joint assemblies of both parties were an utter flop - Sakshi

విజయనగరం సభలో నోరుజారి పరువు తీసేసిన చంద్రబాబు

కరెంటు కోతలున్నాయా అంటే లేవన్న ప్రజలు

బిత్తరపోయిన బాబు

రెండు పార్టీల ఉమ్మడి సభలు అట్టర్‌ ఫ్లాప్‌

సాక్షి ప్రతినిధి, విజయనగరం: ‘కనీసం రూపాయి నెత్తిన పెట్టి వేలం వేస్తే ఒక పైసాకు కూడా కొనని వ్యక్తి పవన్‌ కళ్యాణ్‌’.. అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, జనసేన పార్టీ అధినేతలు సంయుక్తంగా విజయనగరం నడిబొడ్డున బుధవారం రాత్రి నిర్వహించిన బహిరంగ సభలో పక్కనున్న పవన్‌ కళ్యాణ్‌ను వేలెత్తి చూపిస్తూనే చంద్రబాబు తన మనసులో ఉన్న అసలు విషయం బయట­పెట్టేశారు.

ఎప్పటిలాగే అబద్ధాలు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను విమర్శిస్తూ చంద్రబాబు ప్రసంగం సాగింది. ఇప్పుడు కరెంట్‌ కోతలు ఉన్నాయా తమ్ముళ్లూ అంటే సభికులు లేవులేవు అంటూ చేతులు ఊపడంతో చంద్రబాబు కంగుతిన్నారు.రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత మళ్లీ తాను తీసుకుంటానని.. విజయనగరంలో హైటెక్‌ టవర్స్‌ పెడతానంటూ మాట్లాడారు. కాగా చంద్రబాబు, పవన్‌ సభలు విఫలమయ్యాయి. జనాలు కరువయ్యారు. వచ్చిన కొద్దిమంది జనం కూడా చంద్రబాబు మాట్లాడుతుండగానే వెనుదిరిగారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement