పవన్‌కు కేఏ పాల్‌ బంపరాఫర్‌ | Sakshi
Sakshi News home page

50 సీట్లు ఇస్తా.. పవన్‌కు కేఏ పాల్‌ బంపరాఫర్‌

Published Tue, Oct 10 2023 7:36 PM

KA Paul On TDP Destroy Pawan Political Future - Sakshi

సాక్షి,  ఎన్టీఆర్: చంద్రబాబు చేసిన అవినీతి ఆకాశాన్ని అంటుకుందని.. ఆ అవినీతిని దేవుడు కూడా సహించడం లేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్‌ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ కథ ముగిసినట్లేనని ఎద్దేవా చేశారు. 

ఎన్నో కుట్రలు చేసి.. ఎన్టీఆర్‌ను బతికుండగానే చంద్రబాబు చంపేశారు. 64 కేసుల్లో అరెస్ట్‌ కాకుండా.. 14 ఏళ్లపాటు స్టేలు తెచ్చుకున్న వ్యక్తి చంద్రబాబు. అలాంటి వ్యక్తి అవినీతి ఆకాశానికి చేరింది. అందుకే దేవుడు సైతం దానిని సహించలేదు. 2018లో తెలంగాణలో టీడీపీ భూస్థాపితం అవుతుందని చెప్పాను..జరిగింది. 2023లో ఏపీలో టీడీపీ భూస్ధాపితం అవుతుందని చెప్పాను.. అది మీరు కళ్లారా చూస్తున్నారు అని కేఏ పాల్‌ అన్నారు.

సోషల్‌ మీడియాలో 60 లక్షల ఫాలోవర్లు  ఉన్న  పార్టీ టీడీపీ. కానీ, అలాంటి పార్టీ నాయకుడు చంద్రబాబు అరెస్ట్‌ అయితే.. కనీసం 6వేల మంది కూడా రోడ్డు మీదకు రాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. లోకేష్ తన తల్లిని.. భార్యను సానుభూతి కోసం రోడ్ల పై తిప్పుతున్నారు. అది ఘోరమని కేఏ పాల్‌ మండిపడ్డారు.  

పవన్‌కు ఆఫర్‌
పనిలో పనిగా జనసేన చీఫ్‌ పవన్‌ కల్యాణ్‌కు పాల్‌ బంపరాఫర్‌ ఇచ్చారు. ‘‘కేవలం 25 సీట్లకు అమ్ముడు పోయిన వ్యక్తి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కు ఓడిపోయే 25 సీట్లు కావాలా?ప్రజా శాంతి పార్టీ లో 50 సీట్లు కావాలా.. తేల్చుకోవాలి? అని ఆఫర్‌ ప్రకటించారు పాల్‌. టీడీపీ ఇక లేదని.. అది మునిగిపోతున్న పడవ అని.. పవన్‌ మునగడానికే టీడీపీకి వెళ్లారని.. ఓడిపోయే పార్టీ సీట్లు కోరుకుంటున్నారని కేఏ పాల్‌ అన్నారు.  

Advertisement
Advertisement