గుడివాడ: టీడీపీకి బీటీమ్గా ఏపీ బీజేపీ పనిచేస్తోందని మంత్రి కొడాలి నాని విమర్శించారు. వెన్నుపోటు, అబద్ధాలపై ఆధారపడ్డ వ్యక్తి చంద్రబాబు అని, అదే చంద్రబాబు అజెండాతో ఏపీ బీజేపీ పనిచేస్తోందని మండిపడ్డారు. ఎన్నికల్లో బీజేపీ డిపాజిట్లు తెచ్చుకుని చూపించాలని సవాల్ విసిరారు.
మంగళవారం మీడియాతో కొడాలి నాని మాట్లాడుతూ.. ‘చంద్రబాబు ఎక్కడ చర్చ పెట్టినా రావడానికి సిద్ధమే. చంద్రబాబు రాజకీయంగా పూర్తిగా దిగజారిపోయారు. డిపాజిట్ రాని బీజేపీ వాళ్ళు మా గురించి మాట్లాడితే ఎట్లా. ప్రజలను రెచ్చ గొట్టే కార్యక్రమాలకు పోలీసులు ఎందుకు అనుమతిస్తారు. నేను మాట్లాడిన దానికి ,బుద్ద వెంకన్న మాట్లాడిన దానికి చాలా తేడా ఉంది. చంద్రబాబు ఇంట్లో ఉండి మిగతా నేతలతో నన్ను తిట్టిస్తున్నారు. నా మీద 420 వ్యక్తులతో ఆరోపణలు చేయించారు. టీడీపీకి అనుబంధంగా పనిచేసే వ్యక్తి సోము వీర్రాజు. మత కలహాలు రెచ్చగొట్టాలని బీజేపీ యత్నిస్తోంది’ అని కొడాలి నాని ధ్వజమెత్తారు.