ఎవరికీ అవకాశాలకు కొదువలేదు.. బీజేపీలో చేరండి - మధ్యప్రదేశ్ సీఎం | Sakshi
Sakshi News home page

ఎవరికీ అవకాశాలకు కొదువలేదు.. బీజేపీలో చేరండి - మధ్యప్రదేశ్ సీఎం

Published Mon, Mar 4 2024 2:59 PM

Madhya Pradesh CM Mohan Yadav Calls On Yadav Community To Join BJP - Sakshi

ఉత్తరప్రదేశ్‌ పర్యటనలో ఉన్న మధ్యప్రదేశ్ సీఎం 'మోహన్ యాదవ్'.. యాదవ సామాజికవర్గాన్ని బీజేపీలో చేరాలని పిలుపునిచ్చారు. నేను మీ మధ్య మాట్లాడటానికి వచ్చానని, ప్రస్తుతం విజయవంతమైన ప్రధాని నాయకత్వంలో మన సమాజాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు ఇది ఒక పెద్ద అవకాశమని ప్రస్తావించారు.

యాదవ్‌ మహాకుంభ్‌లో ఎంపీ సీఎం పరోక్షంగా సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్‌ యాదవ్‌ కుటుంబాన్ని ఉద్దేశించి.. ఒకే కుటుంబం (యాదవ్‌) సొసైటీకి కాంట్రాక్టర్‌గా వ్యవహరిస్తారని నమ్ముతారు, కానీ ఆ కాంట్రాక్టర్ వ్యవస్థను ప్రజలు వదిలిపెట్టినందుకు నేను సంతోషిస్తున్నానన్నారు.

నిరుపేద కుటుంబంలో ఒకరిని, యాదవ్ కుటుంబంలో ఒకరిని ముఖ్యమంత్రిని చేసింది బీజేపీ. బీజేపీలో ఎవరికీ అవకాశాల కొరత లేదని ఎంపీ సీఎం అన్నారు. యూపీలో తన పర్యటనలు చాలా మందిని కలవరపెడుతున్నాయని, మరోసారి అఖిలేష్ యాదవ్‌ను ఉద్దేశించి అన్నారు. ఎవరికి సమస్యలు వచ్చినా.. మీరు పిలిస్తే వస్తాను అని మోహన్ యాదవ్ అన్నారు.

మోహన్ యాదవ్ లక్నోలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయాన్ని సందర్శించి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. పార్లమెంటరీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని అన్ని స్థానాల్లో బీజేపీ కమలం వికసిస్తుంది, 400 సీట్లను దాటాలన్న ప్రధాని సంకల్పం నెరవేరుతుందనటానికి మీ ఉత్సాహమే నిదర్శనమని అన్నారు.

యాదవ సమాజ ఆరాధ్యదైవం శ్రీకృష్ణుడి జీవిత పోరాటాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. నేడు దేశం మొత్తం సనాతన సంస్కృతిని శ్రీరాముడు, కృష్ణుడి సంస్కృతిగా పరిగణించడం నాకు సంతోషంగా ఉంది. ఎన్ని సవాళ్లు వచ్చినా, ఎన్ని బాధలు ఉన్నా, మన సంస్కృతిని కాపాడుకోవాలని మోహన్ యాదవ్ అన్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement