Minister Roja Sensational Comments On Chandrababu Naidu - Sakshi
Sakshi News home page

రాష్ట్రానికి పట్టిన దరిద్రం, సైతాన్‌ చంద్రబాబే: మంత్రి రోజా

Published Tue, Apr 11 2023 11:49 AM

Minister Roja Comments On Chandrababu - Sakshi

సాక్షి, విజయవాడ: జగనన్నే మా భవిష్యత్‌ అని ప్రజలు బలంగా చెప్తున్నారని మంత్రి రోజా అన్నారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ, జనసేనకి దమ్ముంటే ఇంటింటికి వెళ్లి ఏం చేశారో చెప్పగలరా? అని ప్రశ్నించారు. రాష్ట్రానికి పట్టిన దరిద్రం, సైతాన్‌ చంద్రబాబే. ఓటుకు నోటు కోసం రాష్ట్రాన్ని, రూ.1.50 లక్షల కోట్ల ఆస్తులను నాశనం చేశాడని మంత్రి దుయ్యబట్టారు.

‘‘చంద్రబాబు గత ఐదేళ్లలో ఏం చేశాడో జనంలోకి వెళ్లి చెప్పే ధైర్యముందా?. దేశంలోనే ఏ సీఎం చేయలేని విధంగా జగనన్న ప్రజాసర్వే చేస్తున్నారు. కుప్పంలో కూడా చంద్రబాబుకు ఓటమి తప్పదు’’ అని మంత్రి రోజా అన్నారు.
చదవండి: రామోజీ.. మీ ప్రేమ మాకు అక్కర్లేదు.. అప్పుడెక్కడ దాక్కున్నావు?

Advertisement
Advertisement