MLC Varudu Kalyani Slams TDP And Its Company - Sakshi
Sakshi News home page

‘టీడీపీ అంటే తెలుగు డర్టీ పార్టీ’

Published Sat, Jul 22 2023 12:22 PM

MLC Varudu Kalyani Slams TDP And Its Company - Sakshi

సాక్షి,  విశాఖ:  ఏపీలో అభివృద్ధిని చూసి ఓర్వలేక టీడీపీ విమర్శలు చేస్తోందని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. అభివృద్ధిని అడ్డుకోవాలని టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని ఆమె ధ్వజమెత్తారు. ఏపీలో 5.1 శాతం పేదరికం తగ్గిందని సర్వేలు చెబుతున్నాయని, ఇదంతా సీఎం జగన్‌ పాలనలో సాధ్యమైందని స్పష్టం చేశారు. కోవిడ్‌ సమయంలో ఎన్నో సహాయ కార్యక్రమాలను సీఎం జగన్‌ రాష్ట్రంలో అమలు చేశారన్నారు. 

టీడీపీ అంటే తెలుగ డర్డీ పార్టీ అని, మహిళలను మోసం చేసిన పార్టీ అని విమర్శించారు వరుదు కళ్యాణి. టీడీపీ అంటే తెలుగు దుర్యోధనుల పార్టీ అని కూడా ఎద్దేవా చేశారు వరుదు కళ్యాణి. మహిళా లోకం తలదించుకునేలా టీడీపీ నాయకురాలు అనిత మాట్లాడుతోందని, వంగలపూడి అనిత భాష అసహ్యంగా ఉందన్నారు. అనిత మాట్లాడే భాషను ఆమె పిల్లలే హర్షించరని, మహిళలు పేరెత్తే అర్హత కూడా టీడీపీ లేదన్నారు ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి.

టీడీపీ ఒక సైకో పార్టీ అని, ఆ సైకో పార్టీకి మహిళా అధ్యక్షురాలు అనిత అని వరుదు కళ్యాణి విమర్శించారు. వలంటీర్లపై చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారని,  మహిళలను అవమానించిన వ్యక్తి చంద్రబాబన్నారు.మహిళలకు మంచి చేస్తున్న పార్టీ వైఎస్సార్‌సీపీ అని, మహిళా సాధికారతకు నిదర్శనం వైఎస్సార్‌సీపీ అని తెలిపారు. 

చదవండి: ‘ఎంతమంది కలిసొచ్చినా సీఎం జగన్‌కే ప్రజలు మద్దతు’

Advertisement
Advertisement