బీజేపీ నాయకులకు సరైన సమయంలో బదులిస్తా | Sakshi
Sakshi News home page

బీజేపీ నాయకులకు సరైన సమయంలో బదులిస్తా

Published Fri, Aug 19 2022 6:06 AM

Nitish Kumar snubs BJP jungle raj return allegations - Sakshi

పట్నా:  బిహార్‌లో మళ్లీ జంగిల్‌ రాజ్‌ వచ్చిందంటూ బీజేపీ చేస్తున్న ఆరోపణలను ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ ఖండించారు. బీజేపీ నాయకులకు సరైన సమాధానం ఇస్తానని అన్నారు.  రాష్ట్రీయ జనతా దళ్‌(ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌తో సమావేశం కావడంపై నితీశ్‌ స్పందించారు. ఆయనను తన పెద్దన్నగా భావిస్తానని చెప్పారు. మరోవైపు, బిహార్‌లో కొత్త ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఆర్జేడీ నేత, ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Advertisement
Advertisement