జగిత్యాల విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ | Sakshi
Sakshi News home page

జగిత్యాలలో బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ.. అప్‌డేట్స్‌

Published Mon, Mar 18 2024 10:26 AM

PM Modi Vijaya Sankalpa Sabha At Jagtial Updates - Sakshi

ప్రధాని మోదీ జగిత్యాల పర్యటన.. బహిరంగ సభ అప్‌డేట్స్‌

ప్రధాని మోదీ కామెంట్స్..

  • భారత్ వికాసంతో తెలంగాణా వికాసం కూడా సులభమైతుంది.
  • మూడురోజుల్లో మూడుసార్లు తెలంగాణా వచ్చాను.
  • వందల కోట్ల రూపాయలు తెలంగాణా వికాసం కోసం కేంద్రం కేటాయిస్తున్నాం.
  • తెలంగాణాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఊసే లేదిప్పుడు.
  • తెలంగాణాతో పాటు, దేశం మొత్తం మళ్ళీ బీజేపీ కావాలని కోరుతోంది.
  • సమృద్ధ భారత్ కోసం 400 సీట్లు దాటాలి.
  • అందుకే బీజేపీకే ఓటు వేయాలి.
  • శక్తి స్వరూపిణిలైన ఇంతమంది స్త్రీలు, యువత ఆశీర్వచనం ఇచ్చేందుకు వచ్చారంటే.. నేనెంత అదృష్టవంతుణ్ని!.
  • నేను భారతమాత పూజారిని.
  • ఇండియన్ అలయెన్స్‌కు నామారూపాల్లేకుండా చిత్తు చేసేందుకు ఈ నారీశక్తి అంతా ఒక్క తాటిపైకి రావాలి.
  • చంద్రయాన్ సఫలీకృతం కావడంలో కూడా ఈ నారీశక్తిది కీలకపాత్ర.
  • శక్తి వినాశనాన్ని కోరుకునే వారికి ఇక్కడ స్థానం లేదు, వారిని తుదముట్టించాలి.
  • తెలంగాణా ప్రజల కలలను నిర్వీర్యం చేసిన ప్రజా ఘాతకులు కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు.
  • బీఆర్ఎస్, కాంగ్రెస్ కు తెలంగాణా ఏటీఎం కార్డులా మారింది.
  • తెలంగాణాను మోసం చేయడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూదొందే.
  • బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒక్కటే.
  • అందుకే కాళేశ్వరంకు సంబంధించి ఎలాంటి చర్యల్లేవ్.
  • ఆ రెండు పార్టీలు  మోదీని తిట్టడం, మోదీ జపం చేయడం మాత్రమే చేస్తున్నాయి.
  • మోదీ తెలంగాణా ప్రజలకు గ్యారంటీ ఇస్తున్నాడు.. తెలంగాణాను దోచుకునే వారినెవరినీ వదిలిపెట్టడని.
  • కాంగ్రెస్ కాదది స్కాంగ్రెస్.
  • ఢిల్లీలో లిక్కర్ స్కాంతో ఇక్కడి బీఆర్ఎస్ ఏం చేసిందో చూశారు.
  • కాబట్టి ఆ రెండు పార్టీలను గెలిపిస్తే అంతే సంగతులు.
  • మీరెన్ని సీట్లలో తెలంగాణాలో బీజేపీని గెలిపిస్తే తెలంగాణాలో అంత అభివృద్ధి జరుగుతుంది.
  • వికసత్ తెలంగాణా కావాలంటే బీజేపీని అత్యంత మెజారిటీతో అన్ని సీట్లలో గెలిపించాలి

కిషన్‌రెడ్డి ప్రసంగం.. 

  • మోదీ పాలనలో భారత్‌ అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతోంది
  • 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు
  • రూ.6 వేలు రైతుల ఖాతాల్లో వేస్తున్నారు
  • ఆర్టికల్ 370 నుంచి మొదలుపెడితే.. రామమందిర నిర్మాణం వరకు సుస్థిర పాలన
  • రామగుండం ఎరువుల పరిశ్రమ, జాతీయ రహదారులు, పసుపు బోర్డు, గ్రామపంచాయతీ నిధులివ్వడం.. వీటన్నిటినీ మోడీ ప్రభుత్వం ఎంత అంకితభావంతో చేస్తుందో చూస్తున్నాం
  • సమ్మక్క సారక్క పేరుతో ట్రైబల్ యూనివర్సిటీని ఇచ్చింది మోదీనే
  • ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసింది
  • కాళేశ్వరం, లిక్కర్, దళితబంధు, భూ కేటాయింపుల పేరిట దోపిడీలకు పాల్పడింది
  • కేసీఆర్ కుటుంబం లిక్కర్ స్కాంతో తెలంగాణా రాష్ట్రాన్ని తలదించుకునేలా చేసింది
  • కుక్క తోక వంకర అన్నట్టు కాంగ్రెస్ పార్టీ తీరుతుంది
  • ఆరు గ్యారంటీలని చెప్పి వాటిని అమలు చేయని కాంగ్రెస్ ఇక్కడవసరమా..?
  • అందుకే మళ్లీ మోదీని మూడోసారి ప్రధానిని చేసుకోవాల్సిన అవసరముంది.

జగిత్యాల: అర్వింద్ కామెంట్స్

  • ప్రపంచంలోనే పవర్ ఫుల్ లీడర్ మోదీ
  • భారత దేశం సురక్షింతంగా ఉండాలంటే మోదీ మూడోసారి ప్రధాని కావాలి

  • జగిత్యాలలో ప్రారంభమైన బీజేపీ విజయ సంకల్ప సభ
  • హాజరైన ప్రధాని మోదీ
  • ప్రసంగిస్తున్న బీజేపీ రాష్ట్ర చీఫ్‌ కిషన్‌రెడ్డి

జగిత్యాల బీజేపీ సభకు వర్షం ముప్పు?

  • సభకు వర్షం ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన బీజేపీ నేతలు
  • ప్రధాని మోదీ సభకు భారీ జనసమీకరణ ప్లాన్

బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి జగిత్యాల బయల్దేరిన ప్రధాని మోదీ

  • జగిత్యాలలో కాసేపట్లో బీజేపీ విజయ సంకల్ప సభ
  • సభలో పాల్గొని ప్రసంగించనున్న ప్రధాని మోదీ
  • పాల్గొననున్న కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ ఎంపీ అభ్యర్థులు

  • ఇప్పటికే తెలంగాణలో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ప్రధాని మోదీ.
  • రాష్ట్రంలోని 17 లోక్ సభ సీట్లలో బీజేపీని గెలిపించాలంటూ ప్రజలను కోరుతున్న ప్రధాని.


ఇవాళ జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బీజేపీ విజయసంకల్ప సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు.

ఈ ఉదయం రాజ్‌భవన్ నుంచి బయలుదేరి బేగంపేట్​ఎయిర్​పోర్ట్‌కు చేరుకుని.. ప్రత్యేక హెలికాఫ్టర్‌లో జగిత్యాల వెళ్తారు.

నిన్నసాయంత్రం ఏపీ చిలకలూరిపేట జనగళం సభలో పాల్గొన్న ప్రధాని మోదీ.. రాత్రికి హైదరాబాద్‌ చేరుకుని రాజ్‌భవన్‌లో బసచేశారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement