సాక్షి, హైదరాబాద్: పాలమూరులో ‘ఎన్నికల శంఖారావ సభ’తో రాష్ట్రంలో బీజేపీ ఎన్నికల ప్రచారానికి ఆ పార్టీ అగ్రనేత, ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టనున్నారు. అక్టోబర్ 1 మధ్యాహ్నం ఒంటిగంటకు మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ ఐటీఐ గ్రౌండ్స్లో నిర్వహించే భారీ బహిరంగసభతో మోదీ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో కేసీఆర్ సారథ్యంలోని అధికార బీఆర్ఎస్ పాలన సాగిస్తున్న తీరుపై మొట్ట మొదటిసారిగా మోదీ పూర్తిస్థాయి రాజకీయ ప్రసంగం చేయబోతున్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు.
జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ నాయకత్వాన్ని కూడా అదే స్థాయిలో ఎండగడతారని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికల ఎజెండాను సెట్ చేసే విధంగా మోదీ సభ జరుగుతుందని అంటున్నారు. ఇక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే లోగానే మోదీ సహా హోంశాఖ మంత్రి అమిత్షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బహిరంగ సభలతో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కించాలనే బిగ్ప్లాన్లో ఆ పార్టీ నిమగ్నమైంది. ఆ మేరకే ఈ సభలు జరగనున్నాయి.
వచ్చే నెల 10లోగానే అగ్రనేతల విస్తృత పర్యటనలు
ఇక మళ్లీ వెంటనే అక్టోబర్ 3నే నిజామాబాద్కు మోదీ రానున్నట్టు పార్టీవర్గాల సమాచారం. ఈ సందర్భంగా అక్కడ రోడ్ షో లేదా బహిరంగసభ నిర్వహించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. నిజామాబాద్లో మోదీ పర్యటన తర్వాత...ఏయే తేదీల్లో, ఏయే ఉమ్మడి జిల్లాల్లో అమిత్షా, నడ్డాల సభలు పెట్టాలి, ఎన్ని సభలు నిర్వహించాలనే దానిపై నాయకత్వం తుది నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. మొత్తంగా వచ్చేనెల 10వ తేదీలోగా షెడ్యూల్ వెలువడేలోగానే, పది ఉమ్మడి జిల్లాలు, 17 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ముగ్గురు అగ్రనేతల సభలు ముగించనున్నట్టు పార్టీనాయకులు చెబుతున్నారు.
1న పాలమూరు సభకు ప్రధాని మోదీ
Published Sun, Sep 24 2023 1:55 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నాలుగు ముక్కలు
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
Advertisement