సాక్షి, హైదరాబాద్: ‘కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిలో ఉన్న కారణంగా కొంత సంయమనం పాటించాల్సి వస్తోంది. నేను యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో ఉన్నట్టయితే సీఎం కేసీఆర్ గుండెల్లో నిద్రపోయేవాడిని. ఆయన పడుకున్నా కళ్లు తెరిచి నిద్రపోయేలా, గుండెల్లో గునపం దింపేలా ఉద్యమించేవాడిని’అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం గాంధీభవన్లో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘నిరుద్యోగ నిరసన దీక్ష’జరిగింది. దీక్షలో పాల్గొన్న యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి తదితరులకు రేవంత్ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. తర్వాత రేవంత్ మాట్లాడుతూ.. ‘నాడు రాష్ట్ర సాధన ఉద్యమంలో దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాలకు చెందిన వంద లాది మంది పేదోళ్ల బిడ్డలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు ఉద్యోగాలు రాక, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని భరించలేక ఆ బిడ్డలే చనిపోతున్నారు’అని ఆవేదన వ్యక్తం చేశారు. 1.9 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని బిశ్వాల్ కమిటీ ఇచ్చిన నివేదిక ఏమైందన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఎక్కడని నిలదీశారు. రాష్ట్రంలో ఇప్పటికీ ఒక్క చెప్పుకోదగ్గ నోటిఫికేషన్ను కేసీఆర్ ఇవ్వలేదని మండిపడ్డారు. నిరుద్యోగులకు నెలకు భృతి కింద రూ.3,016 ఇస్తా నని చెప్పి ఆ హామీని పట్టించుకోకుండా నిరుద్యోగ యువత పొట్టకొడుతున్నారని విమర్శించారు.
తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ..
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 12 నెలల్లో అధికారంలోకి వస్తుందని, అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని రేవంత్ చెప్పారు. గోల్కొండ కోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం, ప్రగతి భవన్ను అంబేద్కర్ భవన్గా మారుస్తూ తొలి సంతకం చేయడం ఖాయమని చెప్పారు. శివసేనారెడ్డి మాట్లాడుతూ.. వచ్చే బడ్జెట్లో నిరుద్యోగ భృతికి నిధులు కేటాయించాలని, లేదంటే ఆమరణ నిరాహారదీక్షకు దిగుతానని చెప్పారు. కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, సంపత్కుమార్, చిన్నారెడ్డి, టీపీసీసీ పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ, కిసాన్ కాంగ్రెస్ నేత కోదండరెడ్డి, యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీలు మల్లు రవి, అంజన్కుమార్ యాదవ్, మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డి పాల్గొన్నారు.
అధ్యక్షుడిని కాబట్టే ఆగుతున్నా..
Published Mon, Feb 28 2022 4:35 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- పండ్ల తోటలకు.. 'సన్ బర్న్' ముప్పు!
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
Advertisement