కర్ణాటక: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. కాంగ్రెస్కు మంచి మెజారిటీ వస్తోందని, సొంతంగానే అధికారంలోకి వస్తామని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని పర్యటన ప్రభావం చూపలేదన్నారు. మత రాజకీయాలు కర్ణాటకలో పనిచేయవన్నారు.
120 స్థానాలకుపైగా గెలుస్తాం బీజేపీపై ప్రజలు విసిగిపోయారని, మాకు ఎవరి మద్దతు అవసరం లేదని సిద్ధరామయ్య అన్నారు. కాగా, కాంగ్రెస్ రెబల్స్తో డీకే శివకుమార్ టచ్లోకి వెళ్లారు. రెబల్స్ను గూటికి తీసుకొచ్చే పనిలో పడ్డారు. ఐదుగురు రెబల్స్తో డీకే శివకుమార్ మంతనాలు జరుపుతున్నారు.
#WATCH | Congress leader & former CM Siddaramaiah gives a thumbs up as his party is close to crossing the halfway mark in initial trends in Karnataka pic.twitter.com/rp3B5knUMe