సాక్షి, అమరావతి: బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో గెలిచిన తర్వాత మధ్యలో వదిలేసి కాంగ్రెస్తో కలిసిన టీడీపీకీ రాజకీయాల్లో నీతి నిజాయితీ ఉన్నాయా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. బుధవారం పార్టీ సహచరులతో కలిసి విజయవాడలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సోనియా కొడుకు పక్కకు తోసేస్తున్నా చంద్రబాబు వెళ్లి ఆయన భుజం మీద చెయ్యి వేసిన ఘటనను కర్ణాటకలో జరిగిన కార్యక్రమంలో అప్పట్లో అందరూ చూశారని వీర్రాజు చెప్పారు. మామ మీద ఓ పోటు, వేటు వేసి అధికారంలోకి వచ్చిన వాళ్లకు బీజేపీ గురించి మాట్లాడే అర్హత ఉందా? అని ప్రశ్నించారు. బీజేపీతో పొత్తుతో, వాజ్పేయి గ్లామర్తో 1999లో చంద్రబాబు గెలిచారని చెప్పారు. 2004లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి ఆయనతోపాటు బీజేపీ ఓటమికి కారణమయ్యారన్నారు. 2014లో మరోసారి మోదీ హవాతోనే చంద్రబాబు గెలిచారని చెప్పారు. ఒంటరిగా పోటీ చేసి 2019లో ఓడిపోయారని గుర్తుచేశారు.
ఇక దూకుడుతో కార్యక్రమాలు
రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ శూన్యత ఉందని.. రాబోయే రోజుల్లో పార్టీ ఇంకా దూకుడు ప్రదర్శిస్తుందని వీర్రాజు చెప్పారు. సీపీఐ ఒక పార్టీనేనా అని ప్రశ్నించారు. చందాలు వసూలు చేసుకుంటూ రామకృష్ణ జీవిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. మద్యం ధరలపై మాట్లాడిన మాటలకు వివరణ ఇస్తూ.. పేదల పక్షాన, మహిళా తల్లుల పక్షాన తాను అలా మాట్లాడానని చెప్పారు. మద్యం తాగడాన్ని ప్రోత్సహించాలని, వాళ్లతో తాగిపించాలని మాట్లాడలేదన్నారు. చిన్న వీక్నెస్ను అడ్డంపెట్టుకొని వాళ్ల దగ్గర డబ్బులు తీసుకుంటారా? అని ప్రశ్నించారు. మద్యం రేటు తగ్గిస్తే ఒక సీసా తాగే వారికి నెలకు రూ.6 వేలు, రెండు సీసాలు తాగే వారికి రూ.12 వేలు ఇచ్చినట్టు అని చెప్పారు.
ఫుల్ గ్లాస్ టీనే కావాలి..
బీజేపీ–జనసేన పొత్తుపై వీర్రాజు నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. తాము ఇప్పటికీ పొత్తునే కోరుకుంటున్నామని, కాకపోతే ఫుల్ గ్లాస్ టీ కావాలని కోరుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ ఎదగకూడదనే టీడీపీ, వైఎస్సార్సీపీ నేతలు తాము ఒకరికి అనుకూలం, మరొకరికి వ్యతిరేకం అంటూ మైండ్గేమ్ ఆడుతున్నారని చెప్పారు.
రాజకీయాల్లో టీడీపీకి నీతి నిజాయితీ ఉన్నాయా?
Published Thu, Dec 30 2021 4:02 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రూ.2.71 లక్షల వంచన
ఎన్నికల సామగ్రితో తరలిన సిబ్బంది
జిల్లాలో నేటి ఓటింగ్కు సర్వం సిద్ధం
ఓటుకు రూ.100–200ల పంపిణీ
సురపుర విజేత ఎవరో?
ముగ్గురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు
ట్రాక్టర్ ఇంజిన్ బోల్తా పడి డ్రైవర్ మృతి
నేడే మలివిడత ఎన్నికలు
ఎమ్మెల్యే కారును ఢీకొని ఇద్దరు మృతి
నేటి పోలింగ్కు అన్ని ఏర్పాట్లు
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement