AP: ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్‌ మరో ఛాన్స్‌ | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్‌ మరో ఛాన్స్‌

Published Wed, Feb 14 2024 8:20 AM

Speaker Notices To Ysrcp Rebel Mlas Once Again - Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మరోసారి స్పీకర్ నోటీసులు జారీ చేశారు. రేపు(గురువారం) ఉదయం 11 గంటలకు స్పీకర్ ఎదుట హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు ఈ మేరకు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు అసెంబ్లీ అధికారులు లేఖ రాశారు.

ఈ నెల 12న విచారణకు రావాలని ఇంతకు ముందు స్పీకర్ నోటీసులు జారీ చేయగా, వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేకపోతున్నామని స్పీకర్‌కు వైఎస్సార్‌సీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు లేఖ పంపించారు. తాజాగా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు అసెంబ్లీ అధికారులు నోటీసులు పంపించారు.

ఇదీ చదవండి: CM Jagan: ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడులు 

Advertisement
Advertisement