సాక్షి, అమరావతి: అధికారం పోయింది.. నాయకులు కరువైపోతున్నారు.. కేడర్ కనుమరుగైపోతోంది.. జనంలో పరపతి పోయింది.. దీంతో ఏంచేయాలో పాలుపోని టీడీపీ అధినాయకత్వం అధికార పార్టీ నేతలు, కార్యకర్తలతో కవ్వించి మరీ కయ్యానికి కాలు దువ్వుతోంది. అలజడులు సృష్టించే ప్రయత్నం చేస్తోంది. ఏదో ఒక అంశంపై వివాదం సృష్టించడం, రెచ్చగొట్టడం, ప్రశాంతంగా ఉన్న పల్లెలు, పట్టణాల్లో చిచ్చు రాజేయడం పనిగా పెట్టుకుంది. నిజ నిర్థారణ కమిటీల పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రాద్ధాంతాలకు వ్యూహ రచన చేస్తున్నారు. ఇటీవల కృష్ణాజిల్లా గుడివాడలో కాసినో నిర్వహించినట్లు ఎల్లో మీడియా కథనాలు వండి వార్చగా, వెంటనే చంద్రబాబు దానిపై నిజ నిర్ధారణ కమిటీని నియమించారు.
వర్ల రామయ్య, నక్కా ఆనంద్బాబు, కొల్లు రవీంద్ర, బొండా ఉమామహేశ్వరరావు, ఆలపాటి రాజా, తంగిరాల సౌమ్యను కమిటీ సభ్యులుగా గుడివాడ పంపారు. వీరు అక్కడకు వెళ్లక ముందే టీడీపీ నేతలు మంత్రి కొడాలి నాని కాసినో నిర్వహించారని మూకుమ్మడి దాడి మొదలు పెట్టారు. శుక్రవారం కమిటీ గుడివాడ వెళ్లింది. వాస్తవానికి కమిటీ సభ్యులే అక్కడికి వెళ్లి, నిజానిజాలు వెలికితీయాలి. కానీ, గుంటూరు, విజయవాడ నుంచి వందల మందిని పంపించారు. వారంతా గుడివాడ వెళ్లి వైఎస్సార్సీపీ నేతలను కవ్వించారు. ఎల్లో, సోషల్ మీడియాల ద్వారా సవాళ్లు విసురుతూ, ముఖ్యమంత్రి జగన్, మంత్రి కొడాలి నానీపై విమర్శలు చేస్తూ తీవ్రస్థాయిలో రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేశారు. దీంతో రెండు గ్రూపుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వెంటనే ఇరు వర్గాలను నియంత్రించారు. లేకపోతే గుడివాడలో రణరంగాన్ని సృష్టించాలని టీడీపీ నేతలు రంగం సిద్ధం చేశారు. ఇంతకు ముందు కూడా అధికార వైఎస్సార్సీపీకి సంబంధం లేని పలు అంశాల్లో టీడీపీ ఇదే విధంగా వ్యవహరించింది.
► ఇటీవల గుంటూరు జిల్లా నర్సరావుపేటలో వైఎస్సార్ విగ్రహాన్ని మాయం చేసి ఘర్షణలు సృష్టించడానికి టీడీపీ విఫలయత్నం చేసింది.
► గుంటూరు జిల్లా మాచర్ల మండలం వెల్దుర్తిలో వ్యక్తిగత కారణాలతో జరిగిన హత్యను రాజకీయం చేసేందుకు చంద్రబాబు స్వయంగా అక్కడికి వెళ్లి అభాసుపాలయ్యారు. చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా వందలాది మందిని అక్కడికి తరలించే ప్రయత్నం చేశారు. ఈ పన్నాగం ఆడియో టేపులు బహిర్గతమవడంతో టీడీపీ బండారం బయటపడింది. టీడీపీ నేతలు బొండా ఉమ, బుద్ధా వెంకన్న గతంలో మాచర్లలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులకు కారణమైన ఉదంతాలున్నాయి.
► తూర్పుగోదావరి జిల్లాలో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని టీడీపీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు, చినరాజప్ప తదితరులతో నిజ నిర్థారణ కమిటీని వేసి అక్కడ హైడ్రామా సృష్టించేందుకు ప్రయత్నించారు. ఇలా ఎక్కడ ఏ చిన్న విషయం దొరికినా దాన్ని రాష్ట్ర స్థాయి వివాదంగా మార్చి, వైఎస్సార్సీపీకి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు అంటగట్టి బురద జల్లడమే లక్ష్యంగా చంద్రబాబు పావులు కదుపుతున్నారు. అయితే, వాస్తవాలను గమనిస్తున్న ప్రజలు చంద్రబాబును నమ్మడం లేదు. కనీసం ఆయన పార్టీ కేడర్ కూడా మద్దతివ్వడంలేదు. ఇందుకు శుక్రవారం గుడివాడలో కమిటీ పర్యటనే ఉదాహరణ. అక్కడకు వెళ్లిన టీడీపీ నేతలకు స్థానిక కేడర్ అండ లేకుండా పోయింది. స్థానిక నేతలు కూడా దూరంగా ఉన్నారు. అన్ని ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవడం, టీడీపీ పట్ల ప్రజల్లో సానుకూలత లేకపోవడంతో చంద్రబాబు ఇలాంటి వివాదాలతో వార్తల్లో నిలవాలని ప్రయత్నిస్తున్నట్లు రాజకీయ పండితులు చెబుతున్నారు.
కవ్వించి కయ్యానికి.. టీడీపీ నిజ నిర్ధారణ ఆంతర్యం ఇదే
Published Sun, Jan 23 2022 3:16 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అమెరికా వరల్డ్కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్గా
గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
అమిత్షాపై కోడ్ ఉల్లంఘన కేసు
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement